మోదీతో క‌ర‌చాల‌నం డిప్యూటీ మేయ‌ర్ ఆనందం

Spread the love

ఈ చ‌ర్య‌తో నా జ‌న్మ ధ‌న్య‌మైంద‌న్న ఆషా నాథ్

కేర‌ళ : ఇది ఎవ‌రూ ఊహించ లేదు. గ‌త కొన్నేళ్లుగా కేర‌ళ రాష్ట్రాన్ని క‌మ్యూనిస్టులు ఏళుతున్నారు. ఇక తిరువ‌నంత‌పురం ఎంపీగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత శ‌శి థరూర్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయ‌న ఈ మ‌ధ్య ఎక్కువ‌గా బీజేపీతో ట‌చ్ లో ఉంటున్నారు. ఇదేక్ర‌మంలో ప్ర‌ధాని మోదీ, కేంద్ర మంత్రులతో స‌న్నిహితంగా మెలుగుతున్నారు. ఈ త‌రుణంలో తిరువ‌నంత‌పురంలో ఇటీవ‌ల న‌గ‌ర ఎన్నిక‌లు జ‌రిగాయి. బిగ్ షాక్ ఇస్తూ ఇక్క‌డ తొలిసారిగా భార‌తీయ జ‌న‌తా పార్టీ జ‌య‌కేత‌నం ఎగుర వేసింది. పూర్తి మెజారిటీని సాధించింది. క‌మ్యూనిస్టుల కోట‌లో కాషాయ జెండా ఎగుర వేయ‌డం మామూలు విష‌యం కాదు. ఈ సంద‌ర్బంగా జ‌రిగిన మేయ‌ర్ , డిప్యూటీ మేయ‌ర్ , కార్పొరేట్ల ప్ర‌మాణ స్వీకార ఉత్స‌వానికి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ.

ఈ సంద‌ర్బంగా డిప్యూటీ మేయ‌ర్ గా కొలువు తీరిన ఆషా నాథ్ ను ప్ర‌త్యేకంగా అభినందించారు. ఆమెతో క‌ర‌చాల‌నం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. ఈ సంద‌ర్బంగా త‌ను ఎక్స్ వేదిక‌గా కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. మోదీ క‌ర‌చాల‌నంతో త‌న జ‌న్మ ధ‌న్య‌మైంద‌న్నారు. ఇది కేవలం ఒక ఫోటో మాత్రమే కాదు. ఇది నా ఆత్మలో చెక్కబడిన ఒక మధుర క్షణం అని పేర్కొన్నారు. అంతే కాదు అత్యంత గౌరవంతో నేను వంగి ఆయన పాదాలను తాకినప్పుడు, అధికార శిఖరాగ్రాన ఉన్న ప్రధానమంత్రి మోదీజీ, వినయ పూర్వకంగా న‌న్ను ఆశీర్వ‌దించారంటూ సంతోషం వ్య‌క్తం చేశారు ఆషా నాథ్.

  • Related Posts

    త‌మిళ‌నాడులో ఓటు వేసిన సీఎం ఎంకే స్టాలిన్

    Spread the love

    Spread the loveఈసారి కూడా ఇండియా కూట‌మిదే విజ‌యం త‌మిళ‌నాడు : ఈసారి కూడా త‌మిళ‌నాడులో డీఎంకే ఇండియా కూట‌మి విజ‌యం సాధించడం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు సీఎం ఎంకే స్టాలిన్. త‌న భార్య‌తో క‌లిసి గురువారం త‌మ ఓటు హ‌క్కు…

    టువాస్ పోర్టును సంద‌ర్శించిన మంత్రులు

    Spread the love

    Spread the loveసింగ‌పూర్ లో కొన‌సాగుతున్న అధికారిక ప‌ర్య‌ట‌న సింగ‌పూర్ : ఏపీకి చెందిన మంత్రులు సింగ‌పూర్ లో ప‌ర్య‌టిస్తున్నారు . ఈ ప‌ర్య‌ట‌న‌లో రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత వంగ‌ల‌పూడి, అన‌గాని స‌త్య ప్ర‌సాద్, కింజారపు అచ్చెన్నాయుడు, పొంగూరు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *