ఈ చర్యతో నా జన్మ ధన్యమైందన్న ఆషా నాథ్
కేరళ : ఇది ఎవరూ ఊహించ లేదు. గత కొన్నేళ్లుగా కేరళ రాష్ట్రాన్ని కమ్యూనిస్టులు ఏళుతున్నారు. ఇక తిరువనంతపురం ఎంపీగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత శశి థరూర్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన ఈ మధ్య ఎక్కువగా బీజేపీతో టచ్ లో ఉంటున్నారు. ఇదేక్రమంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో సన్నిహితంగా మెలుగుతున్నారు. ఈ తరుణంలో తిరువనంతపురంలో ఇటీవల నగర ఎన్నికలు జరిగాయి. బిగ్ షాక్ ఇస్తూ ఇక్కడ తొలిసారిగా భారతీయ జనతా పార్టీ జయకేతనం ఎగుర వేసింది. పూర్తి మెజారిటీని సాధించింది. కమ్యూనిస్టుల కోటలో కాషాయ జెండా ఎగుర వేయడం మామూలు విషయం కాదు. ఈ సందర్బంగా జరిగిన మేయర్ , డిప్యూటీ మేయర్ , కార్పొరేట్ల ప్రమాణ స్వీకార ఉత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.
ఈ సందర్బంగా డిప్యూటీ మేయర్ గా కొలువు తీరిన ఆషా నాథ్ ను ప్రత్యేకంగా అభినందించారు. ఆమెతో కరచాలనం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ సందర్బంగా తను ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేసింది. మోదీ కరచాలనంతో తన జన్మ ధన్యమైందన్నారు. ఇది కేవలం ఒక ఫోటో మాత్రమే కాదు. ఇది నా ఆత్మలో చెక్కబడిన ఒక మధుర క్షణం అని పేర్కొన్నారు. అంతే కాదు అత్యంత గౌరవంతో నేను వంగి ఆయన పాదాలను తాకినప్పుడు, అధికార శిఖరాగ్రాన ఉన్న ప్రధానమంత్రి మోదీజీ, వినయ పూర్వకంగా నన్ను ఆశీర్వదించారంటూ సంతోషం వ్యక్తం చేశారు ఆషా నాథ్.






