త్వ‌ర‌లో మున్సిప‌ల్ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్

Spread the love

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన ఉత్త‌మ్ కుమార్ రెడ్డి

హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు రాష్ట్ర భారీ నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో మున్సిప‌ల్ ఎన్నిక‌లకు సంబంధించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ మేర‌కు అప్ డేట్ ఇచ్చారు. కేవ‌లం రెండు మూడు రోజుల్లోనే పుర‌పాలిక సంఘం ఎన్నిక‌ల‌కు సంబంధించి నోటిఫికేష‌న్ విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. వ‌చ్చే నెల ఫిబ్ర‌వ‌రి లోనే పోలింగ్ కార్య‌క్ర‌మం ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉండ‌గా 76వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్బంగా శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇదే స‌మ‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. త‌మ స‌ర్కార్ కు వ‌చ్చిన ఢోకా ఏమీ లేద‌న్నారు. కొంద‌రు కావాల‌ని బ‌ద్నాం చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఆరోపించారు.

దేశంలో ఎక్క‌డా లేని రీతిలో సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేసిన ఘ‌న‌త త‌మ ప్ర‌జా ప్ర‌భుత్వానికే ద‌క్కుతుంద‌న్నారు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి. కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం మాకు గేమ్ ఛేంజర్ అని పేర్కొన్నారు. మరో మూడేళ్లు స్థిరమైన ప్రభుత్వం ఉంటుందని ధీమా వ్య‌క్తం చేశారు నీటి పారుద‌ల శాఖ మంత్రి. అయితే ప్ర‌స్తుతం జ‌ర‌గబోయే మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి, స‌ర్కార్ కు స‌వాల్ తో కూడుకుని ఉన్న‌ద‌న్నారు. మళ్లీ రాబోయేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనంటూ ధీమా వ్య‌క్తం చేశారు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి.

  • Related Posts

    రాష్ట్ర అభివృద్దిపై కూట‌మి స‌ర్కార్ ఫోక‌స్

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన మంత్రి వంగ‌ల‌పూడి అనిత అమ‌రావ‌తి : త‌మ ప్ర‌భుత్వం రాష్ట్ర అభివృద్దిపై ఫుల్ ఫోక‌స్ పెట్టింద‌ని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. రాష్ట్ర సచివాలయంలో సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు…

    ప్ర‌తిప‌క్ష నేత‌ను మాట్లాడ‌కుండా చేస్తే ఎలా..?

    Spread the love

    Spread the loveనిప్పులు చెరిగిన కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి న్యూఢిల్లీ : మోదీ స‌ర్కార్ అనుస‌రిస్తున్న తీరు ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది కాంగ్రెస పార్టీ. ఈ మేర‌కు ప్ర‌స్తుతం పార్ల‌మెంట్ స‌మావేశాలు కొన‌సాగుతున్నాయి. ప్ర‌ధాన అంశాల‌పై ప్ర‌శ్నించేందుకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *