మంత్రుల ర‌హ‌స్య స‌మావేశం పూర్తిగా అబ‌ద్దం

ఖండించిన ఐటీ శాఖ మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబు

హైద‌రాబాద్ : ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌తో పాటు మ‌రికొంద‌రు మంత్రులు ర‌హ‌స్య స‌మావేశం నిర్వ‌హించిన‌ట్లు జ‌రుగుతున్న ప్ర‌చారంపై స్పందించారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇది పూర్తిగా అబ‌ద్ద‌మ‌ని, నిరాధార‌మ‌ని, అవాస్త‌వాల‌ను ప్ర‌చారం చేయొద్దంటూ సూచించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని పేర్కొన్నారు. ర‌హ‌స్యంగా స‌మావేశం కావాల్సిన అవ‌స‌రం ఏముందంటూ తిరిగి ప్ర‌శ్నించారు శ్రీ‌ధ‌ర్ బాబు. ఈ నివేదిక‌లు పూర్తిగా త‌ప్పుదోవ ప‌ట్టించేవిగా ఉన్నాయంటూ వాపోయారు. ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో ఒక‌రినొక‌రు మాట్లాడుకోవ‌డం, చ‌ర్చించు కోవ‌డం స‌హ‌జ‌మ‌ని పేర్కొన్నారు.

కేబినెట్ లో మంత్రులు భేటీ కావ‌డం అనేది స‌ర్వ సాధార‌ణ‌మ‌ని స్ప‌ష్టం చేశారు శ్రీ‌ధ‌ర్ బాబు. దీనిపై పెడ‌ర్థాలు వ‌చ్చేలా కామెంట్స్ చేయ‌డం, లేనిపోని క‌ల్పించి క‌థ‌నాలు అల్ల‌డం ఈ మ‌ధ్య ప‌రిపాటిగా మారిందంటూ మండిప‌డ్డారు దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో, రాజ్యాంగ బాధ్యతలు నిర్వర్తించే వారి మధ్య జరిగే చర్చలను వక్రీకరించకూడదు లేదా అనవసరమైన రాజకీయ రంగు పులమకూడదు అని మంత్రి అన్నారు. సోషల్ మీడియాలో , కొన్ని మీడియా సంస్థల ద్వారా ప్రచారం చేయబడుతున్న తప్పుడు కథనాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *