చాగంటి జీవితం స్పూర్తిదాయ‌కం : అనిత వంగ‌ల‌పూడి

Spread the love

ఆయ‌న బోధ‌న‌లు ఆచ‌ర‌ణీయ‌మైన‌వ‌ని ప్ర‌శంస‌

విశాఖ‌ప‌ట్నం జిల్లా : రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా నియ‌మితులైన ప్ర‌ముఖ ప్ర‌వ‌చ‌న‌క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర్ రావును మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లుసుకున్నారు . ఈ సంద‌ర్భంగా చాగంటి దంప‌తుల‌ను క‌ల‌వ‌డం జీవితంలో మ‌రిచి పోలేన‌ని పేర్కొన్నారు. భారతీయ సనాతన ధర్మం, మత సామరస్యం, నైతిక విలువల గురించి సమాజాన్ని మేల్కొల్ప‌డంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు చేస్తున్న కృషి, ప్ర‌య‌త్నం గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నారు అనిత వంగ‌ల‌పూడి.

ఇదిలా ఉండ‌గా ఆయ‌న చేస్తున్న కృషికి త‌గిన రీతిలో గుర్తింపును త‌మ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఇచ్చార‌ని తెలిపారు. ఆధ్యాత్మిక ప్రవచన చక్రవర్తిగా ఇప్ప‌టికే పేరు పొందార‌ని, ఆయ‌న‌తో మాట్లాడుతూ ఉంటే కాలం అనేది ఒక‌టి ఉంద‌నేది కూడా మ‌రిచి పోతామ‌న్నారు వంగ‌ల‌పూడి అనిత‌. ఇదిలా ఉండ‌గా పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలకు వారి ప్రవచనాలు అందించాలని కోరారు. అంతే కాకుండా అలాగే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించు కోవాలని విన్న‌వించారు . త‌న విన్నపాన్ని మన్నించి, ఫిబ్రవరి నెలలో మన నియోజకవర్గానికి విచ్చేస్తానని వారు హామీ ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు వంగ‌ల‌పూడి అనిత‌.

  • Related Posts

    రాష్ట్ర అభివృద్దిపై కూట‌మి స‌ర్కార్ ఫోక‌స్

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన మంత్రి వంగ‌ల‌పూడి అనిత అమ‌రావ‌తి : త‌మ ప్ర‌భుత్వం రాష్ట్ర అభివృద్దిపై ఫుల్ ఫోక‌స్ పెట్టింద‌ని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. రాష్ట్ర సచివాలయంలో సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు…

    ప్ర‌తిప‌క్ష నేత‌ను మాట్లాడ‌కుండా చేస్తే ఎలా..?

    Spread the love

    Spread the loveనిప్పులు చెరిగిన కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి న్యూఢిల్లీ : మోదీ స‌ర్కార్ అనుస‌రిస్తున్న తీరు ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది కాంగ్రెస పార్టీ. ఈ మేర‌కు ప్ర‌స్తుతం పార్ల‌మెంట్ స‌మావేశాలు కొన‌సాగుతున్నాయి. ప్ర‌ధాన అంశాల‌పై ప్ర‌శ్నించేందుకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *