టీటీడీ హృద‌యాల‌యానికి భారీ విరాళం

అభినందించిన జేఈవో డాక్ట‌ర్ ఎ. శ‌ర‌త్
తిరుప‌తి : శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయానికి ముంబైకు చెందిన అల్కెమ్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మధురిమ సింగ్ రూ. 90 లక్షల విలువైన అత్యాధునిక వైద్య పరికరాలను విరాళంగా అందించారు. ఈ పరికరాలను టిటిడి జేఈవో (ఆరోగ్యం , విద్య) డా. ఎ. శరత్ కు అందజేశారు. ఇందులో భాగంగా 4 హై ఎండ్ వెంటిలేటర్లు , 4 హ్యూమిడిఫయర్లు , 4 హెచ్‌ఎఫ్‌ఎన్‌సీ (హై ఫ్లో నాసల్ కేన్యులా పరికరాలు) ఉన్నాయి.

ఈ సందర్భంగా జేఈవో డా. ఎ. శరత్ మాట్లాడుతూ చిన్నపిల్లల హృదయ చికిత్సలకు ఈ పరికరాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. త్వరలో ప్రారంభం కానున్న నూతన చిల్డ్రన్స్ ఆసుపత్రికి అవసరమైన పరికరాలను విరాళంగా అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని ప్ర‌శంసించారు. అల్కెమ్ ఫౌండేషన్ మరింత అభివృద్ధి సాధించాలని, శ్రీ వేంకటేశ్వర స్వామివారి అనుగ్రహం లభించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మధురిమ సింగ్ ను శాలువాతో సత్కరించారు. శ్రీ వేంకటేశ్వర స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ రెడ్డి, ఆర్ఎంఓ డాక్టర్ భరత్, అల్కెమ్ ఫౌండేషన్ ప్రతినిధులు, వైద్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

  • Related Posts

    శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భ‌ద్ర‌త

    తిరుపతి : తిరుమల రాబోయే శ్రీవారి బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా తిరుమల పోలీసులు, టీటీడీ విజిలెన్స్ విభాగం ఆధ్వ‌ర్యంలో తిరుమలలోని వీవీఐపీ గెస్ట్ హౌస్ నిర్వాహకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టీటీడీ చీఫ్ విజిలెన్స్, సెక్యూరిటీ…

    శ్రీవారి ఆలయంలో స్నపన తిరుమంజనం

    తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా శాస్త్రోక్తంగా ప‌విత్ర సమర్పణ జరిగింది.ఈ సందర్భంగా ఉదయం యాగశాలలో హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఆ తరువాత సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *