టీటీడీ హృద‌యాల‌యానికి భారీ విరాళం

అభినందించిన జేఈవో డాక్ట‌ర్ ఎ. శ‌ర‌త్
తిరుప‌తి : శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయానికి ముంబైకు చెందిన అల్కెమ్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మధురిమ సింగ్ రూ. 90 లక్షల విలువైన అత్యాధునిక వైద్య పరికరాలను విరాళంగా అందించారు. ఈ పరికరాలను టిటిడి జేఈవో (ఆరోగ్యం , విద్య) డా. ఎ. శరత్ కు అందజేశారు. ఇందులో భాగంగా 4 హై ఎండ్ వెంటిలేటర్లు , 4 హ్యూమిడిఫయర్లు , 4 హెచ్‌ఎఫ్‌ఎన్‌సీ (హై ఫ్లో నాసల్ కేన్యులా పరికరాలు) ఉన్నాయి.

ఈ సందర్భంగా జేఈవో డా. ఎ. శరత్ మాట్లాడుతూ చిన్నపిల్లల హృదయ చికిత్సలకు ఈ పరికరాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. త్వరలో ప్రారంభం కానున్న నూతన చిల్డ్రన్స్ ఆసుపత్రికి అవసరమైన పరికరాలను విరాళంగా అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని ప్ర‌శంసించారు. అల్కెమ్ ఫౌండేషన్ మరింత అభివృద్ధి సాధించాలని, శ్రీ వేంకటేశ్వర స్వామివారి అనుగ్రహం లభించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మధురిమ సింగ్ ను శాలువాతో సత్కరించారు. శ్రీ వేంకటేశ్వర స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ రెడ్డి, ఆర్ఎంఓ డాక్టర్ భరత్, అల్కెమ్ ఫౌండేషన్ ప్రతినిధులు, వైద్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

  • Related Posts

    ‘బోనాల’ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

    హైద‌రాబాద్ : రాష్ట్ర సంస్కృతిని, సాంప్ర‌దాయాన్ని ప్రతిబింబించే ఆషాడ మాస బోనాల ఉత్సవాలు గురువారం నుండి ప్రారంభం అయ్యాయి ఘ‌నంగా. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి జంట నగరాల భ‌క్తులంద‌రికీ శుభాకాంక్షలు తెలిపారు. హైద‌రాబాద్ ప్రజల జీవన విధానం,…

    టీటీడీకి రూ.60.61 లక్షల భారీ విరాళం

    తిరుమల : తిరుమ‌ల పుణ్య క్షేత్రానికి భ‌క్తులు పోటెత్తారు. కోరిన కోర్కెలు తీర్చే క‌లియుగ దైవంగా శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి పేరు పొందారు. ఇందులో భాగంగా సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున శ్ర‌మ‌కోర్చి స్వామిని ద‌ర్శించుకునేందుకు పోటీ ప‌డుతుంటారు. గ‌త…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *