నిప్పులు చెరిగిన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి
న్యూఢిల్లీ : మోదీ సర్కార్ అనుసరిస్తున్న తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది కాంగ్రెస పార్టీ. ఈ మేరకు ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రధాన అంశాలపై ప్రశ్నించేందుకు లోక్ సభ స్పీకర్ అనుమతించక పోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంట్ ఆవరణలో తమ మద్దతుదారులతో నిరసన వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు. దేశంలో భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అన్ని పత్రాలను ప్రామాణీకరించినప్పటికీ, అధికార ప్రభుత్వం ఆయనను మాట్లాడకుండా అడ్డుకోవడం దారుణమన్నారు కేసీ వేణుగోపాల్. ప్రజాస్వామిక వాదులు దీనిని ఖండించాలని అన్నారు. ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడకుండా నిరోధించడమే వారి ఏకైక ఎజెండాగా మారిందని ఆరోపించారు , ఎందుకంటే ఆయన ప్రధానమంత్రి పిరికితనాన్ని, అసమర్థతను బట్టబయలు చేస్తారని వారికి తెలుసు అని అన్నారు.
ప్రతి సమావేశంలో, పార్లమెంటులో వారు చేస్తున్న అరాచకాలను వ్యతిరేకించినందుకు ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేస్తున్నారని ఇదెక్కడి ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు కేసీ వేణుగోపాల్. అయినప్పటికీ, అధికారానికి ఎదురుగా నిజం మాట్లాడకుండా, ఈ ప్రభుత్వం పూర్తిగా రాజీపడిందని ప్రజలకు చూపించకుండా మమ్మల్ని ఏదీ ఆపలేదని వార్నింగ్ ఇచ్చారు.





