ఎన్టీఆర్ స్మృతివనం ఐకాన్ గా మారాలి

Spread the love

స్ప‌ష్టం చేసిన నారా చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. తెలుగు వారి ఆత్మ గౌర‌వాన్ని ప్ర‌పంచానికి ప‌రిచయం చేసిన ఒకే ఒక్క‌డు దివంగ‌త ఉమ్మ‌డి ఏపీ ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావు అని కొనియాడారు. ఆయ‌న తెలుగు జాతికి చేసిన సేవ‌ల గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నారు. ఇందులో భాగంగా అమ‌రావ‌తిలోని స‌చివాల‌యంలో త‌న కార్యాల‌యంలో మంత్రి నారాయ‌ణ‌, ఇత‌ర ఉన్న‌తాధికారుల‌తో క‌లిసి స‌మీక్ష చేప‌ట్టారు ముఖ్య‌మంత్రి.
ఇందులో భాగంగా తెలుగువారి ఆత్మగౌరవం- ఆత్మ విశ్వాసం కలగలిపి తెలుగు వైభవంగా అమరావతిలో నిర్మించే ఎన్టీఆర్ స్మృతివనం ప్రాజెక్టును చేపట్టాలని నారా చంద్రబాబు నాయుడు దిశా నిర్దేశం చేశారు.

తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు, భాష, సాహిత్యం, కళలు, ప్రాచీన చరిత్ర తదితర అంశాలకు పెద్దపీట వేస్తూ దీనిని చేపట్టాలని సూచించారు. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై ప్ర‌ధానంగా సమీక్షించారు. అమరావతిలోని నీరుకొండ వద్ద చేపట్టనున్న ఈ ప్రాజెక్టులోని అంశాలను అధికారులు సీఎంకు వివరించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రాచీన తెలుగు చరిత్రతో పాటు ప్రజల మనస్సుల్లో నిలిచి పోయిన అల్లూరి సీతారామరాజు, పొట్టి శ్రీరాములు లాంటి విశిష్ట వ్యక్తుల విగ్రహాలు, సంస్కృతీ సంప్రదాయాలు, భాష, లిపికి చెందిన వివరాలను కూడా తెలియ చెప్పేలా ఏర్పాట్లు చేయాలని స్ప‌ష్టం చేశారు.

  • Related Posts

    కేంద్ర మంత్రివ‌ర్గంలో భారీ మార్పులు..?

    Spread the love

    Spread the loveసంకేతాలు ఇచ్చిన ట్ర‌బుల్ షూట‌ర్ షా న్యూఢిల్లీ : కేంద్రంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎన్డీయే ప్ర‌భుత్వంలో కీల‌క‌మైన ప‌ద‌వులు మార్చే ఛాన్స్ లేక పోలేద‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌ధానంగా బీజేపీకి చెందిన ట్ర‌బుల్ షూట‌ర్,…

    APAIMS 2.0 వ్యవస్థతో అక్ర‌మాల‌కు చెక్

    Spread the love

    Spread the loveఎరువుల పంపిణీపై ఏపీ స‌ర్కార్ ప్ర‌క‌ట‌న అమ‌రావ‌తి : ఎరువు పంపిణీలో పూర్తి పార‌ద‌ర్శ‌క‌త ఉండేందుకు ఏపీ కూట‌మి స‌ర్కార్ ఏపీఏఐఎంఎస్ 2.0 వ్య‌వ‌స్థ‌ను తీసుకు వ‌చ్చింది. గత ప్రభుత్వ హయాంలో సబ్సిడీ ఎరువుల పంపిణీలో చోటుచేసుకున్న అక్రమాలు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *