బీసీ భావజాల ఉద్యమాన్ని పల్లె పల్లెకు విస్తరిస్తాం

Spread the love

పాటే ఆయుధంగా బీసీ రాజకీయ అధికారం సాధిస్తాం

హైద‌రాబాద్ : పాటనే ఆయుధంగా చేసుకున బీసీ కవులు, రచయితలు, కళాకారులు బీసీ భావజాల ఉద్యమాన్ని పల్లె పల్లెకు విస్తరించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు . ఆదివారం హైదరాబాదులో బీసీ కల్చరల్ ఫోరం రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు వరంగల్ శ్రీనివాస్ అధ్యక్షత వహించగా దరువు అంజన్న, కేదారి శ్రీనివాస్ లు సమన్వయం చేశారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీలకు వారసత్వంగా గొప్ప చరిత్ర ఉందని, బీసీ కులాలలో రాజులు, చక్రవర్తులు, మహనీయులు జన్మించారని చెప్పారు. బీసీ కులాలలో తరతరాలుగా ఎంతో ప్రతిభ, పాటావాలు కలిగిన చరిత్ర ఉందన్నారు. ఇలాంటి ఘనమైన చరిత్ర కలిగిన బీసీలు ఇవాళ‌ బలహీనంగా అర శాతం, ఐదు శాతం లేని వాళ్ళ దగ్గర సాగిల పడి అడుక్కోవడంలో అర్థం లేదన్నారు.

బిసి కళాకారులు, కవులు తమ కళాలను గలాలను బీసీల వారసత్వాన్ని, సాంస్కృతిక చైతన్య వైభవాన్ని భవిష్యత్ తరాలకు చాటి చెప్పి పాలితులుగా ఉన్న బీసీలను పాలకులుగా చేయడానికి బీసీ సాంస్కృతిక సైన్యం నిర్విరామంగా కృషి చేయాలని ఆయన కోరారు. బీసీ ఉద్యమాన్ని రాయితీల నుండి రాజ్యాధికారం కోసం, స్వయం పాలన, స్వయం నిర్ణయ అధికారం వచ్చే వరకు చేసే ఉద్యమంలో కవులు. కళాకారులు, రచయితలు తమ వంతు పాత్ర పోషించాలని శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు .

బీసీ కల్చరల్ ఫోరం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి లు వరంగల్ శ్రీనివాస్ ,దరువు అంజన్న లు మాట్లాడుతూ బీసీ సాంస్కృతిక ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి దసరా తర్వాత 33 జిల్లాలో సభలు, సమావేశాలు నిర్వహిస్తామని అన్నారు. ఆ తర్వాత హైదరాబాదులో వేలాది మందితో బీసీ కల్చరల్ ఫోరం రాష్ట్ర మహాసభను నిర్వహిస్తామని తెలిపారు

బీసీ కల్చరల్ ఫోరం రాష్ట్ర కార్యనిర్వాహ అధ్యక్షులు కోదారి శ్రీనివాస్, రాష్ట ఉపాధ్య‌క్షులు అంబటి వెంకన్న, సిరిసినవాడ రామలింగం లు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ తరహా లోనే బీసీల రాజకీయ చైతన్యానికి గ్రామ గ్రామాన బీసీల ధూంధాం సభలు నిర్వహిస్తామని ప్ర‌క‌టించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీ సాంస్కృతిక ఉద్యమాన్ని ఉధృతం చేసి బీసీల హక్కులను సాధించడానికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు.

ఈ సమావేశంలో సిగ విజయ్, మానుకోట ప్రసాద్, మద్దెల సందీప్, సంతోష్, జడల రమేష్, యాట సంధ్య, బుల్లెట్ వెంకన్న, బీసీ నాయకులు కుల్కచర్ల శ్రీనివాస్, కనకాల శ్యాం కుర్మా, భీమనీ మంజరి, చంద్రశేఖర్ గౌడ్, జాజుల లింగం గౌడ్, వరికుప్పల మధు, తదితరులు పాల్గొన్నారు .

  • Related Posts

    ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం స‌బ‌బే

    Spread the love

    Spread the loveమ‌రాఠా మంత్రి గిరీష్ మ‌హాజ‌న్ కామెంట్స్ ముంబై : దేశ వ్యాప్తంగా సంచల‌నంగా మారారు మంత్రి మ‌రాఠాకు చెందిన గిరీష్ మ‌హాజ‌న్. వైరల్ అవుతున్న తన వీడియోపై బుధ‌వారం స్పందించారు. అది తప్పు అని నేను అనను అన్నారు.…

    రేపే త‌మిళ‌నాడులో ఎన్నిక‌ల పోలింగ్

    Spread the love

    Spread the loveఏర్పాట్లు చేశామ‌న్న ఎన్నిక‌ల క‌మిష‌న్ చెన్నై | త‌మిళ‌నాడు రాష్ట్రంలో ఈనెల 23న గురువారం ఎన్నిక‌ల‌కు సంబంధించి పోలింగ్ జ‌ర‌గ‌నుంది.రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిణి అర్చన పట్నాయక్ మాట్లాడారు ఇవాళ. ఎంసీసీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి అడ్డగించిన మొత్తం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *