టీటీడీకి స్మార్ట్ సాఫ్ట్ వేర్ కంపెనీ రూ. 30 లక్షలు విరాళం

Spread the love

టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడుకు అందించిన ప్ర‌తినిధులు

తిరుమ‌ల : క‌లియుగ దైవంగా, కోట్లాది మంది భ‌క్తుల కొంగు బంగారంగా తిరుమ‌ల పుణ్య క్షేత్రం భ‌క్తుల‌తో కిట కిట లాడుతోంది. నిత్యం త‌మ కోరిక‌లు తీరిన భ‌క్తులు నిత్యం ఏదో రూపంలో తాము భ‌ద్రంగా దాచుకున్న డ‌బ్బుల‌ను విరాళాల రూపేణా శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి స‌న్నిధిలో ఏర్పాటు చేసిన హుండీలో వేయ‌డం, ఇంకొన్ని డ‌బ్బుల‌ను టీటీడీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న ట్ర‌స్టుల‌కు విరాళాల రూపేణా అంద‌జేస్తున్నారు. ఇందులో భాగంగా భారీ విరాళాన్ని మంగళ‌వారం హైదరాబాద్ కు చెందిన స్మార్ట్ సాఫ్ట్ వేర్ అండ్ మోహన్ ఇండస్ట్రీస్ ఎండీ యలమంచిలి మదన్మోహన్ రావు టీటీడీకి రూ.30 లక్షలు విరాళంగా అందించారు.

ఈ మేరకు దాత శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు. సదరు విరాళాన్ని శ్రీవేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు, ఇతర ట్రస్టులకు వినియోగించాలని దాత చైర్మన్ ను కోరారు.ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు, ఇత‌ర టీటీడీ అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండ‌గా టీటీడీ ఆధ్వ‌ర్యంలో శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర స్వామి బ్ర‌హ్మోత్స‌వాల‌ను నిర్వ‌హిస్తూ వ‌స్తోంది. భారీ ఎత్తున భ‌క్తులు హాజ‌ర‌య్యారు.

  • Related Posts

    శ్రీ‌కాళ‌హ‌స్తి బ్ర‌హ్మోత్స‌వాల‌కు భ‌ద్ర‌తా ఏర్పాట్లు

    Spread the love

    Spread the loveవెల్ల‌డించిన తిరుప‌తి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తిరుప‌తి జిల్లా : మహాశివరాత్రి సందర్భంగా ముఖ్యంగా శ్రీకాళహస్తి దేవస్థానాన్ని కేంద్రంగా తీసుకుని జిల్లా వ్యాప్తంగా ఉన్న శివాలయాల్లో భారీ ఎత్తున భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేసిన‌ట్లు వెల్ల‌డించారు తిరుప‌తి జిల్లా ఎస్పీ…

    13 నుండి న‌ర‌సింహ స్వామి గుడిలో మ‌హోత్స‌వాలు

    Spread the love

    Spread the loveవెల్ల‌డించిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం తిరుప‌తి : అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం తరిగొండలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో నూతన ధ్వజస్తంభ సంప్రోక్షణ మహోత్సవాలు ఫిబ్రవరి 13 నుండి 15వ తేదీ వరకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *