మార్చి 4న హైదరాబాద్ లో వివాహ రిసెప్షన్
హైదరాబాద్ : పుకార్లకు పుల్ స్టాప్ పెట్టేశారు. గాసిప్స్ కు ఛాన్స్ లేకుండా చేశారు. తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఉత్కంఠకు తెర దించారు. ఫ్యాన్స్ కు పండుగ చేసుకునేలా చేశారు ప్రముఖ నటీ నటులు విజయ్ దేవరకొండ , రష్మిక మందన్నా. ఈ ఇద్దరూ లవ్ లో పడ్డారు పరుశురామ్ తీసిన గీత గోవిందం మూవీ షూటంగ్ సమయంలో. ఇక మందన్నా స్వస్థలం కర్ణాటక. ఇక విజయ్ దేవరకొండది ఉమ్మడి పాలమూరు జిల్లా. ఈ ఇద్దరూ అనుకోకుండా కలుసుకున్నారు. ఆ తర్వాత పీకల లోతు ప్రేమలో పడి పోయారు. మొదట అదేమీ లేదన్నారు . ఆ తర్వాత విదేశాలలో కలిసి తిరిగిన ఫోటోలు హల్ చల్ అయ్యాయి. చివరకు ఉంగరాలు మార్చుకున్నారు. భారీ ఎత్తున పెళ్లికి సంబంధించి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాల పెళ్లి ఫిబ్రవరి 26న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ వేదిక కానుంది. సినీ, వ్యాపార, వాణిజ్య, క్రీడా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వివాహానికి హాజరు కానున్నారు. పెళ్లి అయ్యాక రిసెప్షన్ కార్యక్రమం హైదరాబాద్ లో జరుగుతుందని టాలీవుడ్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. వచ్చే నెల మార్చి 4న దీనికి ముహూర్తం ఖరారు చేసినట్లు టాక్. ఈ ఇద్దరూ హెరిటేజ్ ప్యాలెస్ లో ఒక్కటి కాబోతున్నారు. వాస్తవానికి ఫిబ్రవరి 2నే పెళ్లి చేసుకుంటారని ప్రచారం జరిగింది. కానీ అది వాయిదా పడింది. చివరకు 26వ తేదీ ఖరారైంది. ఈ ఇద్దరి వివాహానికి సంబంధించి వీడియో ట్రెండింగ్ లో ఉంది.





