ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీ‌నివాస‌రావుపై ప‌ల్లా గుస్సా

Spread the love

తీవ్ర హెచ్చ‌రిక‌లు జారీ చేసిన టీడీపీ అధ్య‌క్షుడు
అమ‌రావ‌తి : ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు, ఎమ్మెల్యే ప‌ల్లా శ్రీ‌నివాస రావు త‌మ పార్టీకి చెందిన తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీ‌నివాస‌రావు తీరు గురించి ప్ర‌స్తావించారు. గురువారం శాస‌న స‌భ‌కు విచ్చేశారు ఎమ్మెల్యేతో పాటు పార్టీ చీఫ్‌. సీఎం చంద్ర‌బాబు నాయుడు సీరియ‌స్ గా ఉన్నార‌ని తెలిపారు. ప‌నితీరు మార్చుకోవాల‌ని సూచించారు. ఒక బాధ్య‌త క‌లిగిన ప‌ద‌విలో ఉన్న మీరు ఇత‌రుల‌కు ఆద‌ర్శ‌ప్రాయంగా ఉండాల‌ని పేర్కొన్నారు. అలా కాకుండా పార్టీ రూల్స్ కు విరుద్దంగా ప్ర‌వ‌ర్తించ‌డం, మాట్లాడ‌టం మంచి ప‌ద్ద‌తి కాద‌ని సూచించారు.

ఎవ‌రైనా స‌రే పార్టీ అనేది ముఖ్య‌మ‌ని, పార్టీ త‌ర్వాతే ఎవ‌రైనా అన్న విష‌యం గుర్తు పెట్టుకోవాల‌ని ఎమ్మెల్యే శ్రీ‌నివాస రావుకు స్ప‌ష్టం చేశారు పార్టీ బాస్ ప‌ల్లా శ్రీ‌నివాస‌రావు. ఇవాళ ఈ ఇద్ద‌రూ శాస‌న స‌భ లాబీలో క‌లుసుకున్నారు. చాలా సేపు మాట్లాడారు. క్ర‌మశిక్ష‌ణ అనేది ముఖ్య‌మ‌ని, అది పార్టీ కార్య‌క‌ర్త అయినా లేక నేత‌లు అయినా, మంత్రులు, ఎమ్మెల్సీలు, మంత్రుల‌కు వ‌ర్తిస్తుంద‌ని అన్నారు. పార్టీ లైన్ దాటితే చూస్తూ ఊరుకునేది లేద‌న్నారు. ఈ విష‌యం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు, సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆదేశించార‌ని పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా అనుభవ రాహిత్యంతోనే పొరపాట్లు జరుగుతున్నాయని ఎమ్మెల్యే కొలికిపూడి వివరణ ఇచ్చుకునే ప్ర‌య‌త్నం చేశారు. సీనియ‌ర్లు త‌న‌కు మార్గ‌ద‌ర్శ‌కం చేయాల‌ని కోరారు ప‌ల్లా శ్రీ‌నివాస‌రావును.

  • Related Posts

    మామునూరు ఎయిర్ పోర్టు ప‌నులు ప్రారంభించాలి

    Spread the love

    Spread the loveకేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడుతో రేవంత్ రెడ్డి న్యూఢిల్లీ : తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. ఆయ‌న ఎంపీల‌తో క‌లిసి ఢిల్లీలో కేంద్ర రక్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్…

    మ‌న్రేగా ప‌థ‌కం పేద‌ల పాలిట వ‌రం

    Spread the love

    Spread the loveనిర్వీర్యం చేసిన కేంద్ర ప్ర‌భుత్వం నెల్లూరు జిల్లా : మ‌హాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ ప‌థ‌కం ఆనాడు కోట్లాది మంది పేద‌ల‌కు అన్నం పెట్టింద‌ని, కూలీల‌కు ప‌ని క‌ల్పించింద‌ని కానీ మోదీ స‌ర్కార్ వ‌చ్చాక దానిని నిర్వీర్యం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *