దేశానికే ఆద‌ర్శ ప్రాయం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం

ప్ర‌క‌టించిన నారా చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. శుక్ర‌వారం జ‌రిగిన శాస‌న స‌భ స‌మావేశంలో ఆయ‌న గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్ చేసిన ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానం సంద‌ర్బంగా ప్ర‌సంగించారు. గ‌తంలో జ‌గ‌న్ రెడ్డి హ‌యాంలో ఏపీని స‌ర్వ నాశ‌నం చేశార‌న్నారు. ఏపీ కూట‌మి స‌ర్కార్ కు కేంద్రం అన్ని విధాలుగా స‌హాయ స‌హ‌కారాలు అందించ‌డంతో ప్ర‌స్తుతం వెంటిలేట‌ర్ మీద ఉన్న రాష్ట్రం కొద్ది కొద్దిగా కోలుకుంటోంద‌ని చెప్పారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నామ‌న్నారు. త‌ల్లికి వంద‌నం, మ‌హిళ‌ల‌కు ఉచితంగా ప్ర‌యాణం , త‌దిత‌ర స్కీంలు ఆద‌ర్శంగా మారాయ‌న్నారు సీఎం.

దీపం 2.0 ద్వారా ఏడాదికి 3 సిలెండర్లు ఉచితంగా మహిళలకు అందిస్తు్న్నామ‌ని చెప్పారు. అన్నదాత సుఖీభవ ద్వారా రూ.20 వేల రూపాయలు మూడు విడతల్లో రైతులకు అందిస్తున్నామ‌న్నారు. అన్నా క్యాంటీన్లను అన్ని నియోజకవర్గాల్లోనూ ఏర్పాటు చేస్తున్నామ‌ని తెలిపారు. సమాజంలో ఆర్ధికంగా వెనుకబడి ఉన్న వారందరినీ ఆదుకునేలా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తు్న్నామన్నారు. పీపీపీ వల్ల సంపద సృష్టి జరుగుతోందన్నారు. రోడ్లు, పోర్టులు, ఎయిర్ పోర్టులు ఈ విధానంలోనే నిర్మిస్తు్న్నారని తెలిపారు సీఎం. పీపీపీలోనే వీజీఎఫ్ ద్వారా ప్రాజెక్టు నిర్మించి నిర్వహిస్తారన్నారు. నిర్దిష్ట కాలపరిమితి తర్వాత ప్రభుత్వానికి అప్పగిస్తారని ప్ర‌క‌టించారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *