ద్వాద‌శ జ్యోతిర్లింగం ద‌ర్శించుకున్న రోజా

Spread the love

కీళపట్టు ఆలయంలో అద్భుత శిల్ప ప్రదర్శన

చిత్తూరు జిల్లా : మ‌హా శివ‌రాత్రి ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా నగరి మున్సిపాలిటీ పరిధిలోని కీళపట్టు గ్రామంలోని త్రిపురసుందరీ సమేత చంద్రమౌళీశ్వర ఆలయాన్ని ద‌ర్శించుకున్నారు. ఉత్సవాల సందర్భంగా ఈ ఏడాది కూడా విన్నూత్న శిల్ప అమరికలు చేపట్టారు. ప్రతి సంవత్సరం ప్రత్యేకతతో భక్తులను ఆకట్టుకుంటున్న ఈ ఆలయం, ఈసారి ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రతిష్ఠతో మరింత వైభవంగా మారింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ద్వాదశ జ్యోతిర్లింగాలను అచ్చుపోసినట్లుగా రూపొందించారు.

ఆయా ప్రాంతాల ఆలయాలను ప్రతిబింబించే విధంగా చేసిన ఈ శిల్ప నిర్మాణాలు చూపరులను అబ్బుర పరుస్తున్నాయి. స్థానిక భక్తుడు గణేశ్ ఆధ్వర్యంలో యువకులు రెండు నెలలపాటు కష్టపడి ఈ అమరికలను సిద్ధం చేశారు. ప్రత్యేకత సంతరించుకున్న ఈ శిలారూపాలను వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఈ సందర్భంగా మహాశివరాత్రి వేడుకలలో ప్రధాన అతిథిగా మాజీ మంత్రి ఆర్కే రోజా ముందుగా విచ్చేసి స్వామివారిని ప్రత్యేకంగా దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ద్వాదశ జ్యోతిర్లింగాల శిల్పాలను పరిశీలించి, నిర్వాహకులను అభినందించారు. భక్తులతో మమేకమై శివనామ స్మరణలో పాల్గొన్నారు.

  • Related Posts

    తిరుమ‌ల‌లో వైభ‌వంగా పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌

    Spread the love

    Spread the loveతండోప తండాలుగా త‌ర‌లి వ‌చ్చిన భ‌క్తులు తిరుమ‌ల : కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కిన తిరుమ‌ల పుణ్య‌క్షేత్రం భ‌క్త బాంధ‌వుల‌తో కిట కిట లాడింది. ప్ర‌తి రోజూ 80 వేల మందికి పైగా భ‌క్తులు త‌ర‌లి…

    భ‌క్తుల‌తో కిట కిట లాడుతున్న కేదార్ నాథ్ యాత్ర

    Spread the love

    Spread the loveగంట‌ల త‌ర‌బ‌డి వాహ‌నాల్లోనే తిష్ట వేసిన భ‌క్తులు హిమాచ‌ల్ ప్ర‌దేశ్ : చార్ ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తారు. బద్రీనాథ్.. కేదార్ నాథ్ ఆలయ మార్గాలు భ‌క్త బాంధ‌వుల‌తో కిటకిట లాడుతున్నాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ తో దారిలోనే…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *