ఆంటోనియో గుటెర్రెస్ తో పీఎం భేటీ

ప్ర‌పంచాన్ని శాసిస్తున్న ఏఐ పై చ‌ర్చ

న్యూఢిల్లీ : ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌తో శుక్ర‌వారం చ‌ర్చ‌లు జ‌రిపారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ. ఢిల్లీలో ఇండియా ఇంపాక్ట్ ఏఐ స‌మ్మిట్ 2026లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా ఇరువురి మ‌ధ్య కీల‌క చ‌ర్చ‌లు జ‌రిగాయి. AIని అందరినీ కలుపుకుని పోవడం గురించి ప్ర‌స్తావించారు. ఈ విషయంలో UN ఎలా నిర్మాణాత్మక పాత్ర పోషించగలదో గురించి కూడా మాట్లాడారు. మెరుగైన గ్రహం కోసం AIని ఉపయోగించుకునే లక్ష్యంతో చేసే ఏ ప్రయత్నానికైనా భారతదేశం మద్దతును పునరుద్ఘాటిండం జ‌రిగింద‌ని ఈ సంద‌ర్బంగా చెప్పారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ.

. UN సంస్కరణలపై, ముఖ్యంగా గ్లోబల్ సౌత్‌కు ఎక్కువ స్వరం ఇవ్వడంపై కూడా మేము దృక్కోణాలను మార్పిడి చేసుకున్నామని తెలిపారు పీఎం. ఇదిలా ఉండ‌గా కేంద్ర స‌ర్కార్ ప్ర‌పంచ స్థాయి స‌ద‌స్సును నిర్వ‌హించింది. పెద్ద ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన దిగ్గ‌జ కంపెనీలు, సీఈవోలు, చైర్మ‌న్లు, మేనేజింగ్ డైరెక్ట‌ర్ లు , టెక్నాల‌జీ లో అనుభ‌వం క‌లిగిన ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. మ‌రికొంద‌రు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. మ‌రో ఐపు ఏఐ ప‌రిణామాల‌ను ప‌ర్య‌వేక్షించేందుకు ఇండియా వార్ రూమ్ గా మారాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *