నిరుద్యోగులపై కోదండరాం రెడ్డి గుస్సా

Spread the love

నా ఇంటికి ఎందుకు వ‌చ్చారంటూ ఫైర్

హైద‌రాబాద్ : తెలంగాణ జ‌న స‌మితి పార్టీ అధ్య‌క్షుడు, మాజీ ప్రొఫెస‌ర్ ముద్ద‌సాని కోదండరాం రెడ్డి సీరియ‌స్ అయ్యారు. ఆయ‌న నిరుద్యోగుల‌పై మండిప‌డ్డారు. త‌న ఇంటికి వ‌చ్చిన నిరుద్యోగ సంఘాల నాయ‌కుల‌పై భ‌గ్గుమ‌న్నారు. ఉద్యోగ నోటిఫికేష‌న్లు ఎప్పుడు ఇస్తారంటూ ప్ర‌శ్నించ‌డంతో ఆయ‌న కంట్రోల్ త‌ప్పారు. ఇంకెంత కాలం ఆగాలంటూ కోదండ రాం రెడ్డిని నిల‌దీయ‌డంతో ఆయ‌న స‌హ‌నం కోల్పోయారు. ప్ర‌భుత్వంపై మాట్లాడకుండా బాధితులైన నిరుద్యోగుల‌పై మండిప‌డడంతో అక్క‌డున్న వారంతా ఆశ్చ‌ర్యానికి లోన‌య్యారు. నా ఇంటికి ఎందుకు వ‌చ్చారంటూ ఫైర్ కావ‌డంతో నిరుద్యోగులు అవాక్క‌య్యారు. ఓట్ల కోసం తాను ఎప్పుడూ నిరుద్యోగుల వ‌ద్ద‌కు రాలేద‌న్నారు.

తాను ఏమైనా ప్ర‌భుత్వంలో ఉన్నానా అంటూ నిరుద్యోగ సంఘాల నేత‌ల‌ను ఉద్దేశించి ప్ర‌శ్నించారు. త‌న‌కు మీకు ఎలాంటి సంబంధం లేదంటూ పేర్కొన్నారు. నా ఇంటికి వచ్చి అరవొద్దు అంటూ ఆగ్రహం వ్య‌క్తం చేశారు కోదండ‌రాం రెడ్డి. దీంతో త‌న మాట తీరు ప‌ట్ల తీవ్రంగా మండిప‌డ్డారు నిరుద్యోగ బాధితులు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలో రావ‌డానికి మీరంతా క‌లిసి త‌మ‌ను మోసం చేశార‌ని ఇప్పుడు స్పందించ‌క పోతే ఎలా అని నిప్పులు చెరగారు బాధిత నిరుద్యోగులు.

  • Related Posts

    లిక్కర్ స్కాం కేసులో క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు క్లీన్ చిట్

    Spread the love

    Spread the loveన్యాయ వ్య‌వ‌స్థ‌పై ఉన్న న‌మ్మ‌కం రూడీ అయ్యింది హైద‌రాబాద్ : మాజీ ఎమ్మెల్సీ క‌ల్వకుంట్ల క‌విత‌కు భారీ ఊర‌ట ల‌భించింది. దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగించిన లిక్క‌ర్ స్కాం కేసులో ఎలాంటి అక్ర‌మాలు చోటు చేసుకోలేదంటూ కోర్టు తీర్పు చెప్పింది.…

    మనమిత్రను మరింత యూజర్ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దుతాం

    Spread the love

    Spread the loveరాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ అమరావతి : ప్రస్తుతం రాష్ట్రంలో మనమిత్ర ద్వారా 943 సేవలు అందిస్తున్నామ‌ని అన్నారు మంత్రి నారా లోకేష్. ఇప్పటి వరకు ఈ యాప్ ద్వారా 1.48కోట్ల సేవలు అందించడం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *