7న మిట్ట‌ల్ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాప‌న‌

Spread the love

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన మంత్రి కొల్లు ర‌వీంద్ర

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కృషి వ‌ల్ల రాష్ట్రంలో అతి పెద్ద ఉక్కు ఆధారిత ప‌రిశ్ర‌మ రాబోతోంద‌ని , ఇందుకు త్వ‌ర‌గా అడుగులు ప‌డ‌బోతున్నాయ‌ని చెప్పారు మంత్రి కొల్లు ర‌వీంద్ర‌. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ అర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు మార్చి 7న శంకుస్థాపనకు ముహూర్తం ఖ‌రారైంద‌ని తెలిపారు. ఈ వార్త‌ ఖరారవ్వడం తెలుగు వ్యక్తిగా గర్వంగా ఉందన్నారు కొల్లు ర‌వీంద్ర‌.

అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో రూ.1.35 లక్షల కోట్లతో ఏర్పాటు చేసే ఈ ప్లాంటుతో సుమారు 50 వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి ఇచ్చే ప్రాధాన్యతకు అర్సెలార్ మిట్టల్ సంస్థ ప్రకటన నిలువుటద్దం అని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ , ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుల‌ సమక్షంలో మార్చి 7న శంకుస్థాపన జరిగే కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరారు మంత్రి కొల్లు ర‌వీంద్ర‌. గ‌తంలో రాష్ట్రాన్ని ఏలిన జ‌గ‌న్ రెడ్డి స‌ర్కార్ పూర్తిగా విస్మ‌రించింద‌ని , అభివృద్దిని అడ్డుకునే ప్ర‌య‌త్నం చేసింద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

  • Related Posts

    పోలవరం-నల్లమల సాగర్ లింకు రాష్ట్రాలకూ లాభమే

    Spread the love

    Spread the loveకీల‌క వ్యాఖ్య‌లు చేసిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. గురువారం శాస‌న స‌భలో ప‌లువురు స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు కూల్ గా స‌మాధానం ఇచ్చారు.…

    మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులకు ఖుష్ క‌బ‌ర్

    Spread the love

    Spread the loveరూ. 1000 కోట్ల విలువైన రెడీ టు ఆక్యుపై ఫ్లాట్స్ ఇస్తాం హైద‌రాబాద్ : రాజేంద్ర న‌గ‌ర్ ఎమ్మెల్యే వ‌న్నాడ ప్ర‌కాశ్ గౌడ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. మ‌ధు పార్క్ రిడ్జ్ అపార్ట్ మెంట్ వాసుల‌కు ఖుష్ క‌బ‌ర్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *