ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో సీనియర్ నేత జగ్గారెడ్డి
న్యూఢిల్లీ : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. రాజ్యసభకు ఖాళీ అయిన ఎంపీ స్థానాలలో వీ హెచ్ హనుమంత రావు, జెట్టి కుసుమకుమార్ కు ఇవ్వాలని ఏఐసీసీ బాస్ మల్లికార్జున్ ఖర్గే కు విన్నవించారు. ఈ సందర్బంగా ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున చర్చలు కూడా కొనసాగాయి. తెలంగాణలో రాజ్యసభ ఖాళీ అయిన స్థానాలు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో కూడా మాట్లాడటం జరిగిందన్నారు. రాహుల్ గాంధీనీ, మల్లికార్జున్ ఖర్గేని కలిసేందుకు వచ్చానని చెప్పారు. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా రాహుల్ గాంధీని కలవలేక పోయానని, కానీ పార్టీ బాస్ ను కలిసినట్లు తెలిపారు జగ్గారెడ్డి.
వారికి రాజ్యసభ అవకాశాలపై ఆలోచన చేయాలని ఖర్గేను కోరినట్లు చెప్పారు. జెట్టి కుసుమ కుమార్ యూత్ కాంగ్రెస్ లీడర్, స్టూడెంట్ లీడర్ కమ్మ సామాజిక నుంచి ఉన్నాడు, కమ్మ నాయకుడుగా అవకాశం ఇవ్వాలని కోరానని తెలిపాడు. జెట్టి కుమార్ ఫ్యామిలీ ఫ్రీడమ్ ఫైటర్స్, వాళ్ళ కుటుంబం నుంచి అందరూ కాంగ్రెస్ లోనే ఉన్నారని చెప్పారు. ఇక హనుమంతరావు తెలంగాణలో అనేక ముఖ్యమంత్రులతో పని చేశారు , మూడు సార్లు రాజ్యసభ ఎంపీగా పని చేశారని గుర్తు చేశారు జగ్గారెడ్డి. రాజీవ్ గాంధీ, సోనియాగాంధీ ఆయనకు అవకాశాలు ఇచ్చారని తెలిపారు. వయసులో పెద్ద వ్యక్తి, చురుకైన వ్యక్తి కాబట్టి మరోసారి అవకాశం ఇవ్వాలని కోరానన్నాడు.






