హైడ్రా ప్ర‌జావాణికి 32 ఫిర్యాదులు

అందాయ‌న్న వ‌ర్ల పాప‌య్య

హైద‌రాబాద్ : హైడ్రా ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ప్ర‌జా వాణికి 32 ఫిర్యాదులు అందిన‌ట్లు వెల్ల‌డించారు అద‌న‌పు సంచాల‌కులు వ‌ర్ల పాప‌య్య‌. ఆక్ర‌మ‌ణ‌దారుల క‌బ్జాల గురించి వాపోయారు బాధితులు. త‌మ‌కు వారి నుంచి ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని కోరారు. ఇదిలా ఉండా రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ మండల్ లో ని TNGO’s Colony పరిధిలో ప్రభుత్వానికి చెందిన ఖాళీ స్థలం ఆక్రమణకు గురైందని స్థానికులు ఫిర్యాదు చేసారు. ప్లాట్ నంబర్ 311 ప్రాంతంలో సుమారు 300 గజాల ప్రభుత్వ ఖాళీ స్థలం ఉందని తెలిపారు. ఈ స్థలం గతంలో అధికారికంగా కేటాయించబడిన ప్లాట్ల మధ్యలో ఉన్న ప్రభుత్వ భూమిగా పేర్కొన్నారు. ఆక్రమణలను వెంటనే తొలగించి, ఆ స్థలాన్ని తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని కోరారు.

శంషాబాద్ లోని ఎం.బి. మిషన్ కంపౌండ్‌లో ఉన్న స‌మాదులు క‌బ్జాకు గురౌతున్నాయ‌ని HYDRAA ప్రజావాణి లో ఎం.బి. చర్చి, ఎం.బి. సమాధుల నిర్వహణ కమిటీ ప్రతినిధి ప‌విత్ర సాగ‌ర్ ఫిర్యాదు చేశారు. శంషాబాద్ గ్రామంలోని సర్వే నంబర్ 619లో ఉన్న చర్చి సమాధులకు స‌బంధించిన‌ భూమి శతాబ్దానికి పైగా చర్చికి చెందినదిగా ఉందని తెలిపారు. ఈ భూమి ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ జాబితాలో కూడా నమోదై ఉందని పేర్కొన్నారు. అయితే కొందరు వ్యక్తులు సర్వే నంబర్ 618గా చూపిస్తూ రికార్డులను మార్పులు చేసి అక్రమ రిజిస్ట్రేషన్ పొందినట్లు ఆరోపించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో అక్రమంగా కంచెలు వేయడం, నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతోందని వాపోయారు.

  • Related Posts

    ‘మీ మార్టుల’ ద్వారా స‌రుకుల అమ్మ‌కం

    అమ‌రావ‌తి : ఏపీ ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. స‌హ‌కార సంస్థ (ఎన్సీసీఎఫ్‌) తో ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా తొలి విడ‌త‌గా రాష్ట్రంలో 1000కి పైగా మీ మార్టుల‌ను ఏర్పాటు చేయ‌నుంది. అంతే కాకుండా ఆగ‌స్టు 1 నుంచి పైల‌ట్…

    ఏపీలో రేష‌న్ దుకాణాల్లో నాణ్య‌మైన బియ్యం

    అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ సంద‌ర్బంగా పేద‌ల‌కు నాణ్య‌మైన బియ్యం అంద‌జేసేందుకు శ్రీ‌కారం చుట్టింది. ఈ సంద‌ర్బంగా రాష్ట్రంలో పైల‌ట్ ప్రాజెక్టును తొలిసారిగా దేశంలోనే ఏపీలోని కాకినాడ‌లో అమ‌లు చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు రాష్ట్ర పౌర‌స‌ర‌ఫ‌రాల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *