చెన్నై : దమ్మున్న దర్శకుడు శంకర్ దర్శకత్వం వహించిన ఇండియన్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఇండియన్ -2 సీక్వెల్ ఆశించిన మేర ఆడలేదు. దీంతో అందరూ శంకర్, కమల్ లు కలిసి పని చేయడం లేదంటూ ప్రచారం జరిగింది. అయితే అందుకు భిన్నంగా కీలక అప్ డేట్ వచ్చింది. ఇదిలా ఉండగా మరోసారి శంకర్, లోక్ నాయకుడు కలిసి ముచ్చటగా మూడోసారి ఇండియన్ -3 చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పనులను తిరిగి ప్రారంభించారు. ‘ఇండియన్ 2’ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచినప్పటికీ, ఇప్పుడు ఈ చిత్రం తుది పోస్ట్-ప్రొడక్షన్ దశకు చేరుకుంటోంది. ‘ఇండియన్ 2’ విడుదల తర్వాత ఈ మూడవ భాగం పనులు తాత్కాలికంగా నిలిపి వేయబడ్డాయి. అయితే, మూడవ భాగంలోని ప్రధాన భాగాన్ని రెండవ చిత్రంతో పాటే చిత్రీకరించినందున, ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు తుది దశకు చేరుకుంది.
ఈ చిత్రానికి పెద్దగా కొత్త చిత్రీకరణ అవసరం లేదు, కేవలం చిన్నపాటి ప్యాచ్వర్క్ మాత్రమే మిగిలి ఉంది. గణనీయమైన స్థాయిలో VFX పనులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ‘ఇండియన్ 2’లో కథనపరంగా ఉన్న లోపాలను సరిదిద్దడానికి శంకర్ రీషూట్ల కోసం అదనపు బడ్జెట్ను కేటాయించే అవకాశం ఉందని సమాచారం. ఇందులో కమల్ హాసన్ ‘సేనాపతి’ పాత్రలో తిరిగి కనిపించనున్నారు; ఈ చిత్రం ‘ఇండియన్ 2’కు సీక్వెల్గానూ , గత చరిత్రను తెలిపే ప్రీక్వెల్గానూ ఉండనుంది. ఇందులో కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్ , ఎస్.జె. సూర్య కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిత్ర బృందం చెన్నైలో పోస్ట్-ప్రొడక్షన్ పనులను తిరిగి ప్రారంభించినప్పటికీ, థియేటర్లలో విడుదలయ్యే తేదీని ఇంకా ప్రకటించ లేదు.







