సామాజిక విప్ల‌వ నాయ‌కుడు దొమ్మేటి వెంక‌ట్ రెడ్డి

Spread the love

ఘ‌నంగా నివాళులు అర్పించిన సీఎం చంద్ర‌బాబు

అమ‌రావ‌తి : సామాజిక విప్ల‌వ నాయ‌కుడు దొమ్మేటి వెంక‌ట్ రెడ్డి అని ప్ర‌శంసించారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా దొమ్మేటి జ‌యంతిని అధికారికంగా నిర్వ‌హిస్తున్నారు ఈ సంద‌ర్బంగా స‌చివాల‌యంలో త‌న ఛాంబ‌ర్ లో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో దొమ్మేటి వెంక‌ట్ రెడ్డి చిత్ర ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు. శెట్టిబలిజ సంక్షేమ సంఘ స్థాపకుడిగా, సంఘ సంస్క‌ర్త‌గా , మాన‌వ‌తావాదిగా పేరు పొందార‌ని ప్ర‌శంసించారు. శెట్టిబలిజ సంక్షేమ సంఘం ఏర్పాటుతో బలహీన వర్గాల ఆత్మగౌరవ జ్యోతి వెలిగించిన మహనీయులు దొమ్మేటి వెంకటరెడ్డి అని కితాబు ఇచ్చారు. ఆయన చేసిన సామాజిక సేవలకు గుర్తుగా దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని చెప్పారు నారా చంద్రబాబు నాయ‌డుఉ.

దేశ స్వాతంత్య్రానికి పూర్వమే సామాజిక సేవతో పాటు, శెట్టిబలిజల అభ్యున్నతికి కృషి చేసి అందరి గుండెల్లో నిలిచారని అన్నారు. ‘చదువుతోనే సాధికారత’ అనే సత్యాన్ని, విద్య ప్రాముఖ్యతను ఆరోజుల్లోనే చాటి చెప్పారని చెప్పారు. సామాన్యులపై జరుగుతున్న అన్యాయాలను ఎదిరించి, తన వారందరికీ ధైర్యాన్ని ఇచ్చిన ధీశాలి దొమ్మేటి వెంకటరెడ్డి అని కొనియాడారు. ఈ జయంతి వేడుకల వేళ ఆయనను స్మరించుకుని, స్ఫూర్తి పొందుదాం అని పిలుపునిచ్చారు నారా చంద్ర‌బాబు నాయుడు.

  • Related Posts

    రాజీవ్ ఆరోగ్య శ్రీ ప‌రిమితి రూ. 5 లక్ష‌ల‌కు పెంపు

    Spread the love

    Spread the loveశాస‌న మండ‌లిలో ప్ర‌క‌టించిన సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : విద్యుత్ శాఖలో పనిచేస్తూ విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున ప్రమాద బీమా చెక్కులు అందజేశారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. మృతి…

    ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి..?

    Spread the love

    Spread the loveఅసెంబ్లీలో నిలదీసిన మాజీ మంత్రి హరీశ్ రావు హైద‌రాబాద్ : స‌ర్కార్ నిర్వాకంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. అసెంబ్లీ సమావేశాల్లో ఆర్టీసీ కార్మికుల సమస్యలు, సంస్థ మనుగడపై ప్రశ్నించారు.. ఆర్టీసీ ఉద్యోగులకు ఎన్నికల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *