స్వంత పార్టీ నేత‌లే గోతులు త‌వ్వితే ఎలా..?

Spread the love

నిప్పులు చెరిగిన ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయ‌క‌త్వం అనుస‌రిస్తున్న తీరు ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్. ఆయ‌న అధ్య‌క్షుడు రామ్ చంద‌ర్ రావు, కేంద్ర మంత్రి గంగ‌గాపురం కిష‌న్ రెడ్డిల స‌మ‌క్షంలోనే నిప్పులు చెరిగారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు . ఇలాంటి చిల్ల‌ర మ‌ల్ల‌ర వేషాలు వేయ‌డం మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. పార్టీలో అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యం అనేది ఒక‌టి ఉంటుంద‌ని, ఆ దిశ‌గా న‌డుచుకోక పోతే ఎలా అని ప్ర‌శ్నించారు. ఇటీవల డివిజన్ అధ్యక్షుల ఎంపిక కోసం వేసిన అబ్జర్వర్ల జాబితా విషయంలో నాకు ఇప్పటికి సమాచారం లేదని ఆరోపించారు. ఇలాగే వ్య‌వ‌హ‌రిస్తే ఎలా అని నిలదీశారు ఈట‌ల రాజేంద‌ర్.

పార్టీ నిర్ణయాల్లో నాకు కనీసం సమాచారం అందడం లేదని మండిప‌డ్డారు. సీనియర్ నేతగా నాకు ఒక గుర్తింపు ఉంద‌న్నారు. పార్టీ దాన్ని కాపాడ కోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ప్ర‌త్యేకించి సోషల్ మీడియాలో నాపై వస్తున్న నెగెటివ్ కామెంట్స్ వెనకాల బీజేపీ పార్టీ నేతలే ఉన్నారని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు . సొంత పార్టీ నేతలే నాపై నెగెటివ్ క్యాంపెయిన్ చేయించడం మంచి పద్ధతి కాదన్నారు. మంత్రి కిషన్ రెడ్డి, టీబీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావుల ముందే ఈటెల రాజేందర్ ఫైర్ కావ‌డం క‌ల‌క‌లం రేపింది.

  • Related Posts

    కాముని చెరువు పున‌రుద్ద‌ర‌ణ ప‌నులు చేప‌ట్టాలి

    Spread the love

    Spread the loveఆదేశించిన హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ హైద‌రాబాద్ : మూసాపేట‌లోని కాముని చెరువును హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ సంద‌ర్శించారు. రెండో విడ‌త చేప‌డుతున్న 14 చెరువుల్లో కాముని చెరువు కూడా ఉంద‌నే విష‌యం విధిత‌మే. ఈ చెరువు…

    జీవ‌న్ రెడ్డిని బుజ్జ‌గించిన టీపీసీసీ చీఫ్

    Spread the love

    Spread the loveత‌న‌ను క‌లిసిన విప్ ఆది శ్రీ‌నివాస్ క‌రీంన‌గ‌ర్ జిల్లా : కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డిని మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్ , విప్ ఆది శ్రీ‌నివాస్.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *