బాలాన‌గ‌ర్ మండ‌లంలో హ‌రీష్ రావు భూక‌బ్జా

Spread the love

శాస‌న స‌భ‌లో సీఎం రేవంత్ రెడ్డి ఆరోప‌ణ‌లు

హైద‌రాబాద్ : మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావుపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు సీఎం ఎ రేవంత్ రెడ్డి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డ‌గోలుగా కోట్లు విలువ చేసే భూముల‌ను అక్ర‌మంగా క‌బ్జాకు పాల్ప‌డ్డార‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఆదివారం శాస‌న స‌భ వేదిక‌గా సీఎం సీరియ‌స్ కామెంట్స్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఆయ‌న తాజాగా హ‌రీష్ రావు అక్ర‌మాల , భూ క‌బ్జాల చిట్టా విప్పారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు త‌మ వ‌ద్ద రెడీగా ఉన్నాయ‌ని చెప్పారు సీఎం. ద‌మ్ముంటే విచార‌ణ‌కు సిద్దం కావాల‌ని హ‌రీష్ రావుకు స‌వాల్ విసిరారు .

ఇందుకు సంబంధించి హ‌రీశ్ రావు బాగోతాన్ని బ‌ట్ట బ‌య‌లు చేశారు సీఎం. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలంలో మాజీ మంత్రి హరీశ్‌రావు తన కుటుంబ సభ్యులతో కలిసి వందల ఎకరాల భూమిని అక్రమంగా దక్కించుకున్నారని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఆరోపించారు. ధరణి పోర్టల్‌ను అడ్డం పెట్టుకుని, ప్రైవేటు కంపెనీలను బెదిరించి ఈ భూములను బదలాయించు కున్నారని పేర్కొన్నారు. ఈ భూకబ్జాపై హౌస్ కమిటీ వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్ర‌క‌టించారు. హరీశ్‌రావు… నిజాయితీప రుడైతే అందుకు సహకరించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

  • Related Posts

    టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కోసం రూ. 200 కోట్ల స్థ‌లం క‌బ్జా

    Spread the love

    Spread the loveఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు హైద‌రాబాద్ : బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని హైద‌రాబాద్ న‌గ‌రం న‌డిబొడ్డున పార్టీ ఆఫీస్ కోసం రూ. 200 కోట్ల విలువైన స్థ‌లాన్ని క‌బ్జా చేసింద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు…

    స్మశానాల అభివృద్ధి పనుల్లో మంత్రి శ్ర‌మ‌దానం

    Spread the love

    Spread the loveనిమ్మ‌ల రామానాయుడు ప‌లువురికి ఆద‌ర్శ‌ప్రాయంపశ్చిమగోదావరి జిల్లా : ఏపీ రాష్ట్ర భారీ నీటి పారుద‌ల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు సంచ‌ల‌నంగా మారారు. ఆయ‌న ప‌లువు మంత్రులు, ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు ఆద‌ర్శ ప్రాయంగా మారారు. ఆదివారం ప‌శ్చిమ గోదావ‌రి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *