దళిత క్రిష్టియన్లకు కేంద్రం అన్యాయం
విజయవాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు కేంద్ర సర్కార్ నిర్వాకంపై. తాజాగా దళిత క్రిష్టియన్లకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దారుణంగా ఉందన్నారు. ఈ దేశంలో మతం పేరుతో, కులం పేరుతో చిచ్చు పెట్టి బీజేపీ లబ్ది పొందాలని చూస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. మిగిలిన వాళ్ళు సెకండ్ గ్రేడ్ సిటిజన్లుగా బ్రతకాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు. బీజేపీ అధికారం లోకి వచ్చిన నాటి నుంచే ఇదే వైఖరి అనుసరిస్తోందన్నారు. మతం పేరుతో విభజించాలి . మంటలు పెట్టాలి .. చలి కాచుకోవాలి ఇదే కొనసాగిస్తోందన్నారు. మణిపూర్ , గోద్రా ఘటనలు ఇందుకు నిదర్శనం అన్నారు. జనాలను విడదీసి లబ్ధి పొందాలని బీజేపీ చేస్తోందని మండిపడ్డారు. తాజాగా సుప్రీమ్ కోర్టు ఇచ్చిన తీర్పు కూడా బీజేపీ కుట్రలో భాగమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల్లో చంద్రబాబు దళిత క్రిస్టియన్లకు SC హోదా ఇప్పిస్తా అన్నారని, కట్టుబడి ఉన్నామని చెప్పారు
మరి ఇప్పుడు చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. బిజెపి చేతిలో ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థలు అన్ని ఉన్నాయని, ఇప్పుడు సుప్రీం కోర్టును కూడా బీజేపీ గుప్పిట్లో పెట్టుకుందా? ఈ తీర్పు ద్వారా అనిపిస్తోందన్నారు. ఇంత అన్యాయం జరుగుతుంటే చంద్రబాబు నోరు విప్పక పోవడం దారుణమన్నారు. చంద్రబాబు ను దళితుల పక్షం అని ఎలా అనుకోవాలని అన్నారు. ఇక జగన్ కూడా దళితుల పక్షం అని ఈ తీర్పుపై నోరు విప్పలేదన్నారు. అధికారంలో ఉన్నన్నాళ్లు బీజేపీ కి దత్తపుతుడుగా ఉన్నారు. బీజేపీ బిల్లులకు , నిర్ణయాలకు మద్దతు ఇచ్చారు .రాష్ట్రంలో దళిత క్రిస్రియన్లు YCP కి ఓటేశారు. ఇపుడు మోదీ దగ్గరకు మీ ఎంపీలను తీసుకు వెళ్లి అడగలేరా అని నిలదీశారు షర్మిలా రెడ్డి.






