నేతన్నలను నిర్లక్ష్యం చేసిన జగన్ రెడ్డి
అమరావతి : ఏపీ సర్కార్ నేతన్నలకు చేయూత ఇస్తోందని అన్నారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. బుధవారం ఆమె అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో హోం మంత్రి పర్యటించారు. ఈ సందర్బంగా నక్కపల్లిలో మంత్రికి ఘన స్వాగతం పలికారు మహిళలు. నక్కపల్లిలో ఇంటింటికి వెళ్లి పింఛనలు పంపిణీ చేశారు. వారి యోగక్షేమాలు అడిగారు. నేతన్న జీవితాల్లో సరి కొత్త వెలుగులంటూ కరపత్రాలతో ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేశారు. చేనేత మగ్గాలకు 200 యూనిట్లు కరెంట్ ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. ఈ స్కీంను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు వంగలపూడి అనిత.
అనంతరం చేనేత కార్మికులతో మాట్లాడారు. వారితో కలిసి మగ్గాన్ని నేశారు. ఇదే సమయంలో చేనేత కార్మికురాలి వద్ద చీరను కొనుగోలు చేశారు. కరెంట్ బిల్లు భారాన్ని తగ్గించి, చేనేత కార్మికులకు ఆదాయం పెరిగేలా చేయడమే తమ ప్రభుత్వం లక్ష్యమని స్పష్టం చేశారు. అక్కడి నుంచి నేరుగా అప్పల పాయకరావుపేట గ్రామాని వెళ్లారు మంత్రి. లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. బోదుగలం సమీపంలో గల ఆర్ అండ్ ఆర్ కాలనీలో గృహాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.





