డంపింగ్ యార్డు ఏర్పాటును వెన‌క్కి తీసుకోవాలి

Spread the love

స‌ర్కార్ ను డిమాండ్ చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

క‌రీంన‌గ‌ర్ జిల్లా : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. హుజూరాబాద్ డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా చేప‌ట్టిన‌ ఐక్య నిరసన, దీక్షకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున‌ మద్దతు ల‌భించింది.
హుజూరాబాద్‌లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిర్ణయానికి వ్యతిరేకంగా రాంపూర్, రంగాపూర్, కందుగుల, ధర్మరాజుపల్లి ,జూపాక సిర్సపల్లి,రాజపల్లి గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలు డంపింగ్ యార్డ్ వల్ల పంటలు, చెరువులు, భూగర్భ జలాలు , ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. హుజూరాబాద్ ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతినేలా చేసే ఈ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే, ఈ నెల 7, 8 తేదీలలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి , జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న నిరాహార దీక్షకు గ్రామాల ప్రజలందరూ స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో పాల్గొంటామని ప్రకటించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వం గౌరవించాల‌ని కోరారు. హుజూరాబాద్‌లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలతో కలిసి చివరి వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. లేక‌పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోక తప్ప‌ద‌ని హెచ్చ‌రించారు.

  • Related Posts

    సింగ‌రేణిని ప‌ట్టించుకోని కాంగ్రెస్ స‌ర్కార్

    Spread the love

    Spread the loveక‌న్నెర్ర చేసిన క‌ల్వ‌కుంట్ల క‌విత హైద‌రాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత నిప్పులు చెరిగారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉండేవో ఇప్పుడు కూడా అలాగే పరిస్థితులు ఉన్నాయ‌ని ఆవేద‌న చెందారు.…

    సీఎం రేవంత్ రెడ్డికి అంత సీన్ లేదు

    Spread the love

    Spread the loveఎద్దేవా చేసిన కేర‌ళ సీఎం విజ‌య‌న్ కేర‌ళ : తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డికి అంత సీన్ లేదంటూ ఏకి పారేశారు కేర‌ళ సీఎం పిన‌ర‌య్ విజ‌య‌న్. ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకుంది. ఈ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *