ఎద్దేవా చేసిన కేరళ సీఎం విజయన్
కేరళ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి అంత సీన్ లేదంటూ ఏకి పారేశారు కేరళ సీఎం పినరయ్ విజయన్. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఈ నెలలోనే శాసన సభకు సంబంధించి పలువురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. స్టార్ క్యాంపెయినర్లు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరపున సీఎం రేవంత్ రెడ్డి క్యాంపెయిన్ చేశారు. ఇదే క్రమంలో ఆయన సీఎం పినరయ్ విజయన్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇక తన శకం ముగిసిందని, ఓడి పోవడం ఖాయమని జోష్యం చెప్పాడు.
ఈ సందర్బంగా కేరళ సీఎం పినయర్ విజయన్ తీవ్రంగా స్పందించాడు. రేవంత్ రెడ్డిపై భగ్గుమన్నారు. ఆయనలో రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు లేవన్నాడు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఓటుకు నోటు దొంగ.. రేవంత్ గురించి నేనేమి మాట్లాడుతానని పేర్కొన్నాడు. అతను ఓటు చోరీ చేశాడని మీ అందరికి తెలుసు అన్నారు. ఇక తను నా గురించి మాట్లాడేంత మొగోడు కాదన్నారు. ఒకరిపై రాళ్లు వేసేటప్పుడు ముందు వెనుకా ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు. కేరళ ప్రజలు దొంగల మాటలు ఎప్పుడు విశ్వసించరని అన్నారు.





