పరిగి నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత
వికారాబాద్ జిల్లా : పరిగి నియోజకవర్గంలో అరెస్ట్ ల పర్వం కొనసాగుతోంది. మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన నేపథ్యంలో పరిగి ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంగళవారం పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొడంగల్ నియోజకవర్గంలోని బొంరాస్ పేట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటులో భూములు కోల్పోతున్న బాధితులకు అండగా ఉంటామని ప్రకటించింది బీఆర్ఎస్. బాధితులకు భరోసా కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్న మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డిలను హైదరాబాద్ లో అడ్డుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు.
ఇదిలా ఉండగా మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి సీరియస్ గా స్పందించారు. తాము ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా పరిగి నియోజకవర్గం కడ్లాపూర్ గ్రామంలో రైతుల బాధలు వినడానికి మీటింగ్ పెట్టుకున్నా మన్నారు. అక్కడికి పోలీసులు వెళ్లి రైతులని ఆరెస్ట్ చేసి బెదిరిస్తున్నారని ఆరోపించారు. టెంటును కూల్చేశారని మండిపడ్డారు. ఇది మంచి పద్దతి కాదన్నారు మహేష్ రెడ్డి. మరో వైపు ఎమ్మెల్యే హరీష్ రావును అప్పా జంక్షన్ వద్ద అడ్డుకున్నారు ఖాకీలు. ఆయన వాహనాలకు అడ్డంగా నిలిపారు లారీలను.





