ప్రశంసించిన కెప్టెన్ రియాన్ పరాగ్
గౌహతి: ఐపీఎల్ 2026 మెగా టోర్నీలో రియాన్ పరాగ్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ దుమ్ము రేపుతోంది. ఇప్పటివరకు ఆడిన ప్రతి మ్యాచ్ లో గెలుపొందింది. తాజాగా అత్యంత బలమైన పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ కు బిగ్ షాక్ ఇచ్చింది. వర్షం కారణంగా లీగ్ మ్యాచ్ ను అంపైర్లు కేవలం 11 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్ లో యంగ్ స్టార్స్ యశస్వి జైశ్వాల్ , వైభవ్ సూర్యవంశీలు ముంబై బౌలర్లకు షాక్ ఇచ్చారు. కళ్లు చెదిరే షాట్స్ ఇచ్చారు. ముందుగా బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత, నిర్దేశించిన ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 150 రన్స్ చేసింది. అనంతరం మైదానంలోకి వచ్చిన ముంబై ఇండియన్స్ జట్టును 27 పరుగుల తేడాతో ఓడించింది. ఈ గెలుపుతో ఐపీఎల్ లో వరుసగా మూడు మ్యాచ్ లు విజయం సాధించడం విశేషం. దీంతో ఆరు పాయింట్లతో టోర్నీలో టాప్ లో నిలిచింది.
ఈ సందర్భంగా కెప్టెన్ రియాన్ పరాగ్ మీడియాతో మాట్లాడారు. ఇందుకు ప్రధాన కారణం ఏ జట్టుకు లేనటువంటి ఓపెనింగ్ జోడి తమకు ఉండడం వల్లనే జరిగిందన్నాడు. జైశ్వాల్, సూర్యవంశీల ఆడుతున్న తీరు అద్భుతం అని ప్రశంసించాడు. జైస్వాల్ 32 బంతుల్లో 10 బౌండరీలు, నాలుగు సిక్సర్లతో 77 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా, సూర్యవంశీ 14 బంతుల్లో 39 పరుగులు చేసి RRకు మంచి ఆరంభాన్ని అందించాడు. ఈ ఇద్దరినీ అత్యుత్తమ ఓపెనింగ్ జోడీగా అభివర్ణించాడు. వారి నైపుణ్యం, పరిణితి, నిలకడను ప్రశంసిస్తూ, సూర్యవంశీ ఆల్రౌండ్ సామర్థ్యాన్ని, జైస్వాల్ అనుభవాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు.







