చెరువులు మాయం క‌మిష‌న‌ర్ ఆగ్ర‌హం

Spread the love

చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని స్ట్రాంగ్ వార్నింగ్

హైద‌రాబాద్ : హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ దూకుడు పెంచారు. ప్ర‌జావాణిలో వ‌చ్చిన ఫిర్యాదుల‌ను ఆస‌రాగా చేసుకుని ఆక్ర‌మ‌ణ‌కు గురైన చెరువుల‌ను ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా శంషాబాద్ మండ‌లం మామిడిప‌ల్లి ప‌రిస‌రాల్లో నాలుగైదు చెరువులు మాయ‌మ‌య్యాయ‌ని స్థానికులు ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు పెద్ద ఎత్తు దీనిపై తీవ్రంగా స్పందించారు క‌మిష‌న‌ర్. ఒంగోని కుంట‌, క‌న‌క‌య్య‌కుంట‌, మ‌ర్రివాణికుంట‌, ఎర్ర‌కుంటలో కొన్నిటిని పూర్తిగా ఆక్ర‌మించ‌డాన్ని సీరియ‌స్‌గా ప‌రిగ‌ణించారు. ఇరిగేష‌న్‌, రెవెన్యూ అధికారుల‌తో మాట్లాడారు.

ఇక్క‌డి చెరువులు, వ‌ర‌ద కాలువ‌ల గురించి పూర్తి స‌మాచారం సేక‌రించాల‌ని సూచించారు ఏవీ రంగ‌నాథ్. ఈ చెరువుల‌ను క‌లుపుతూ సాగే వ‌ర‌ద కాలువ‌ల‌ను క‌బ్జా చేయ‌డం లేదంటే ఇష్టానుసారం మూసేయ‌డంతో వ‌ర్షాకాలం వ‌ర‌ద ఎటు వెళ్లాలో తెలియ‌ని ప‌రిస్థితుల్లో నివాసాలు నీట మునుగు తున్నాయ‌నే ఫిర్యాదుల‌ను కూడా ప‌రిశీలించారు. ఆక్ర‌మ‌ణ‌దారుల‌తో స‌మావేశాన్ని కూడా ఏర్పాటు చేసి క‌బ్జాల‌ను తొల‌గించాల‌ని సూచిస్తామ‌ని అన్నారు. లేని ప‌క్షంలో హైడ్రా నేరుగా రంగంలోకి దిగుతుంద‌ని స్థానికుల‌కు స్ప‌ష్టం చేశారు. పూర్తి స్థాయిలో స‌మాచారం సేక‌రించాల‌ని హైడ్రా అధికారుల‌ను క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ఆదేశించారు.

  • Related Posts

    సీఎస్ఆర్ నిధుల కోసం ప్ర‌త్యేక పాల‌సీ

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కార్పొరేట్ సోష‌ల్ రెస్పాన్సిబిలిటీపై ఫోక‌స్ పెడుతున్న‌ట్లు తెలిపారు. రాష్ట్రంలో కార్పొరేట్ కంపెనీల CSR (corporate social responsibility)…

    ఐసిస్ సూత్రధారి ఆకిబ్ కు లుక్ అవుట్ జారీ

    Spread the love

    Spread the loveదుబాయ్ కి చెందిన సూత్ర‌ధారని నిర్దార‌ణ ఉత్త‌ర ప్ర‌దేశ్ : దుబాయ్‌కు చెందిన ఐసిస్ సూత్రధారి ఆకిబ్ కోసం యూపీ ఏటీఎస్ ప్రపంచవ్యాప్త హెచ్చరిక జారీ చేసింది. భారతదేశంలో ఇటీవల ఛేదించబడిన ఐసిస్ ఉగ్రవాద ముఠాకు సూత్రధారిగా అనుమానిస్తున్న,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *