మాతా అమృతానందమయి ఆశీర్వాదం అద్భుతం

Spread the love

సంతోషం వ్య‌క్తం చేసిన బీజేపీ నేత విష్ణు వ‌ర్ద‌న్ రెడ్డి

కేర‌ళ : కోట్ల మంది ప్రేమించే అమ్మ శ్రీ మాతా అమృతానందమయి ఆశీస్సులు అందుకోవ‌డం ఆనందంగా ఉంద‌న్నారు బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు విష్ణు వ‌ర్ద‌న్ రెడ్డి. ప్రపంచ వ్యాప్తంగా ప్రేమ, శాంతి, పేదల శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తూ కోట్లాది మందిని ఆధ్యాత్మికంగా, సామాజికంగా దగ్గరకు తీసుకుని, సేవతో పాటు మానవ విలువలను బోధిస్తున్న మాతా అమృతానందమ‌యి గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని పేర్కొన్నారు.

భక్తుడిగా అమ్మ వారి ఆశీస్సులు పొందడానికి కేరళ రాష్ట్రం లోని కొల్లం జిల్లాలో సముద్రం తీరానికి దగ్గరగా, ఉన్న వారి ఆశ్రమానికి వెళ్లిన నన్ను ఎంతో ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నార‌ని తెలిపారు. దేశం, సమాజం, సేవా కార్యక్రమాలు, పేదల అభ్యున్నతి వంటి అనేక ముఖ్యమైన విషయాలపై సుదీర్ఘంగా చర్చించడం నాకు ఎంతో ప్రేరణనిచ్చిందని అన్నారు. సమాజంలో మార్పు తీసుకు రావాలంటే సేవాభావం, నిబద్ధత, సహనం ఎంత ముఖ్యమో వారు వివరించిన విధానం ఎంతో ప్రభావితం చేసిందన్నారు.

పలు అంశాలపై వారు అందించిన మార్గదర్శకాలు నాకు భవిష్యత్‌లో మరింత స్పష్టతను ఇచ్చాయని తెలిపారు. ముఖ్యంగా, సేవలో మరింత భాగస్వామ్యం కావాలని, ప్రజలకు మరింత చేరువ కావాలని వారు ఇచ్చిన సూచనలు నా మీద ఉన్న బాధ్యతను మరింత పెంచేలా చేశాయ‌న్నారు.

  • Related Posts

    శ్రీ‌శైలంలో ఘ‌నంగా కుంభోత్స‌వం

    Spread the love

    Spread the loveఅమ్మ వారికి నేత్ర శోభితంగా అలంకారం శ్రీ‌శైలం : ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రం శ్రీ‌శైలం భ‌క్త బాంధ‌వుల‌తో కిట‌కిట లాడుతోంది. మంగ‌ళ‌వారం మ‌ల్ల‌న్న ఆల‌యంలో శ్రీ‌ భ్రమరాంబా దేవికి కుంభోత్సవం ఘ‌నంగా నిర్వ‌హించారు. అమ్మవారి ఆలయానికి నిమ్మకాయలతో నేత్ర శోభితంగా…

    బాస‌ర ఆల‌యంలో సీఎం పూజ‌లు

    Spread the love

    Spread the loveమ‌న‌వ‌డికి అక్ష‌ర అభ్యాసం నిర్మ‌ల్ జిల్లా : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా సోమ‌వారం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆల‌య క‌మిటీ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. ఇక్క‌డికి ప్ర‌తి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *