newsseals.com
News

ప్ర‌తిష్టాత్మ‌కంగా తెలుగుదేశం పార్టీ మ‌హానాడు

VijayaBhaskar April 11, 2026
newsseals-PallaSrinivasRao
Spread the love

నిర్వ‌హిస్తామ‌న్న పార్టీ చీఫ్ ప‌ల్లా శ్రీ‌నివాస‌రావు

అమ‌రావ‌తి : ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీ‌నివాస రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఈసారి భారీ ఎత్తున మ‌హానాడు నిర్వ‌హిస్తామ‌న్నారు. ఇదిలా ఉండ‌గా ఇవాళ
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు-2026 కోసం అనువైన వేదికను ఎంపిక చేసే ప్రక్రియలో భాగంగా రాష్ట్ర టిడిపి అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని నాథవలస, పైడిభీమవరం, రణస్థలం, డెంకాడ తదితర ప్రాంతాల్లో మొత్తం తొమ్మిది అనువైన స్థలాలను పల్లా క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నిర్వహించే మహానాడును సీఎం, పార్టీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో కనీవినీ ఎరుగని రీతిలో.. చారిత్రాత్మకంగా నిలిచేలా నిర్వహిస్తామని అన్నారు ప‌ల్లా శ్రీ‌నివాస్ రావు. లక్షలాది మంది కార్యకర్తలకు ఇబ్బంది కలగకుండా.. రవాణా, పార్కింగ్, భద్రత ,వాస్తు అనుకూలత వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని వేదికను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఇప్ప‌టి నుంచే కార్య‌క్ర‌మాలు మొద‌లు పెట్టామ‌ని చెప్పారు ప‌ల్లా శ్రీ‌నివాస రావు.