బీజేపీ ప‌టిష్ట‌త కోసం కార్య‌క‌ర్త‌లు కృషి చేయాలి

Spread the love

మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్ పిలుపు

అనంత‌పురం జిల్లా : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. అనంత‌పురం జిల్లా
ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లిలో నిర్వహించిన పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. “Nation First – Party Next – Self Last” అనే భావనతో ప్రతి కార్యకర్త పని చేయాలని పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం నుంచి ఏకాత్మ భావంతో, దేశ సేవనే పరమావధిగా తీసుకుని ముందుకు సాగుతోందని స్ప‌ష్టం చేశారు.

1985లోనే మాజీ ప్రధానమంత్రి , దివంగ‌త‌ అటల్ బిహారీ వాజపేయి కాంగ్రెస్‌ను ప్రజలు తిరస్కరించే రోజు వస్తుందని చెప్పారన్నారు. ఈ విష‌యాన్ని మ‌రోసారి గుర్తు చేశారు మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్. ఆ మాటలు నేటి రాజకీయ పరిణామాల్లో నిజమయ్యాయని అన్నారు. దేశం, సమాజం కోసం కట్టుబడి పని చేసేందుకు ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు మంత్రి. పార్టీ సిద్ధాంతాలను, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్య‌త ప్ర‌తి ఒక్క‌రిపై ఉంద‌న్నారు.

  • Related Posts

    క్వాంటం వ్యాలీకి కేరాఫ్ గా అమ‌రావ‌తి : సీఎం

    Spread the love

    Spread the loveఅమ‌రావ‌తిలో ఇవాళ ప్రారంభించిన చంద్ర‌బాబు అమ‌రావ‌తి : క్వాంటం వ్యాలీకి ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి కాబోతోంద‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. మంగ‌ళ‌వారం దేశంలోనే తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని నేడు అమరావతిలోముఖ్యమంత్రి నారా…

    దేశానికి దిక్సూచి డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్

    Spread the love

    Spread the loveఘ‌నంగా నివాళులు అర్పించిన మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి అమ‌రావ‌తి : డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ సూర్య చంద్రులు ఉన్నంత వ‌ర‌కు నిలిచే ఉంటార‌ని అన్నారు మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. భార‌త దేశానికి దిక్సూచి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *