పోలవరంను సందర్శించిన జీఆర్ఎంబీ చైర్మన్

Spread the love

ప‌నులు త్వ‌రిత‌గ‌తిగ‌న చేప‌ట్టాల‌ని ఆదేశం

అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ పోల‌వ‌రం ప్రాజెక్టును త్వ‌రిత‌గ‌తిన చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించింది. ఈమేర‌కు దూకుడు పెంచారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఈ సంద‌ర్బంగా పోలవరం ప్రాజెక్ట్ ను గోదావరి రివర్ మానేజ్మెంట్ బోర్డు చైర్మన్ (జి ఆర్ ఎం బి ) పీ దోర్జీ గ్యాంబ సందర్శించారు. ఆయన ప్రాజెక్ట్ అతిధి గృహం వద్ద పీపీఏ సిఈఓ సంజీవ్ వోహ్రా , పీపీఏ డిప్యూటీ డైరెక్టర్ రవి, పోలవరం ప్రాజెక్ట్ ఎస్ఈ ఆర్ రామచంద్ర రావు, ఈఈ లు డి. శ్రీనివాస్, పీ వెంకటరమణ, కె బాలకృష్ణ, డీఈఈలు శ్రీకాంత్, మాధవరావు, ఎం ఈ ఐ ఎల్ జనరల్ మేనేజర్ ఏ గంగాధర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ మురళి పమ్మి స్వాగతం పలికారు.

కొద్దిసేపు వారితో సమావేశమైన జీఆర్ఎంబీ చైర్మ‌న్ దోర్జీ పోలవరం స్పిల్ వే, ఎగువ కాఫర్ డ్యామ్, గ్యాప్ 1, 2 పరిశీలించారు. ఇప్పటి వరకు జరిగిన పనుల వివరాలు తెలుసుకున్నారు. పనులు జరుగుతున్న తీరుపట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. నిర్దిష్ట గడువులోగా పనులు పూర్తి చేయాలని సూచించారు. ఈ మేర‌కు నిర్ల‌క్ష్యం చేయొద్ద‌ని సూచించారు. కేంద్ర స‌ర్కార్ పోల‌వ‌రం ప‌నులు చేప‌ట్టేందుకు నిధులు మంజూరు చేసేందుకు రెడీగా ఉంద‌న్నారు.

  • Related Posts

    శ్రీమన్నారాయణ మహా యజ్ఞానికి జగన్‌కు ఆహ్వానం

    Spread the love

    Spread the loveఏప్రిల్ 19 నుంచి 29వ తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న య‌జ్ఞం అమ‌రావ‌తి : మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డిని ఆయన నివాసంలో మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు శ్రీశ్రీశ్రీ త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ…

    పేద‌ల ఆక‌లి తీరుస్తున్న అన్న క్యాంటీన్

    Spread the love

    Spread the loveప్రారంభించిన సీఎం చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : అన్న క్యాంటీన్లు పేద‌ల ఆక‌లిని తీరుస్తున్నాయ‌ని అన్నారు సీఎం చంద్ర‌బాబు నాయుడు.పెదకూరపాడు నియోజకవర్గం ధరణికోటలో కార్మికులతో కలిసి అన్న క్యాంటీన్‌ను ప్రారంభించి ప్ర‌సంగించారు. అన్న క్యాంటీన్ ప్రారంభం అనంతరం పేదలకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *