ప్ర‌జాస్వామ్యం ఇంకా బ‌తికే ఉంది

ఎంపీ సంజ‌య్ రౌత్ షాకింగ్ కామెంట్స్

ముంబై : తాజాగా దేశంలోని ఐదు రాష్ట్రాల‌లో జ‌రిగిన ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై స్పందించారు శివ‌సేన బాల్ థాక్రే ఎంపీ సంజ‌య్ రౌత్. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యం చనిపోదు, . ఓడిపోదు ఎందుకంటే దేశ ప్రజలు ఇంకా సజీవంగా ఉన్నారు. సమయం వచ్చినప్పుడు, ప్రజాస్వామ్యం మరోసారి శిఖరాలను అధిరోహిస్తుందని స్ప‌ష్టం చేశారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే, గెలుపునైనా, ఓటమినైనా అంగీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని ప్ర‌క‌టించారు. ప‌శ్చిమ బెంగాల్ లో భార‌తీయ జ‌న‌తా పార్టీ గెల‌వ‌డం అనైతిక‌మ‌ని పేర్కొన్నారు.

నిజాయితీగా ఎన్నిక‌లు జ‌రిగి ఉంటే ప్ర‌జాస్వామ్యం అనేది గెలిచి ఉండేద‌న్నారు సంజ‌య్ రౌత్. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. డెమోక్రసీకి ఢోకా లేదు. కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డ‌గోలు రాజ‌కీయాలు చేశార‌ని ఆరోపించారు. అందుకే భార‌తీయ జ‌న‌తా పార్టీ గెలుపొందింద‌ని పేర్కొన్నారు. ఎన్నిక‌ల సంఘం ప‌రోక్షంగా, ఇతోధికంగా స‌పోర్ట్ గా నిలిచింద‌ని, దాదాపు 100కి పైగా సీట్ల‌కు లోపాయికారిగా మ‌ద్ద‌తు ఇచ్చింద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ఎంపీ సంజ‌య్ రౌత్. అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసిన ఘ‌న‌త ప్ర‌ధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు ద‌క్కుతుంద‌న్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *