ప్రకటించిన టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్
అమరావతి : తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈనెలలో మూడు రోజుల పాటు మహానాడు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. చీఫ్ ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ లు పలు కమిటీలను ఏర్పాటు చేశారు. మహానాడు నిర్వహణ కోసం 20 కమిటీలను ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా మే 27,28,29 తేదీలలో మూడు రోజుల పాటు జరగనుంది.
మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో 10 మందితో సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు. పల్లా శ్రీనివాసరావు నేతృత్వంలో ఆహ్వాన కమిటీ నియమించారు. యనమల రామకృష్ణుడు నేతృత్వంలో తీర్మానాల కమిటీ ఏర్పాటు చేయగా పయ్యావుల కేశవ్, రామ్మోహన్ నాయుడు నేతృత్వంలో సభా నిర్వహణ కమిటీని నియమించారు. అచ్చెన్నాయుడు నేతృత్వంలో వసతి కమిటీని ఏర్పాటు చేసిన టీడీపీ అధిష్టానం. గతంలో ఎన్నడూ లేనంతగా మహానాడును నిర్వహించాలని ఆదేశించారు పార్టీ బాస్ నారా చంద్రబాబు నాయుడు.






