కోర్టును ఆశ్రయించిన సింగర్ మంగ్లీ

Spread the love

ఉద్దేశ పూర్వకంగా అసత్య ప్రచారం

హైద‌రాబాద్ : మైక్రో ఫైనాన్స్ మోసం కేసులో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోంది ప్ర‌ముఖ గాయ‌ని మంగ్లీ అలియాస్ స‌త్య‌వ‌తి రాథోడ్. ఇందుకు సంబంధించిన తాజా వివాదంపై కోర్టును ఆశ్రయించింది సింగర్ మంగ్లీ. తనపై ఉద్దేశ పూర్వకంగా అసత్య ప్రచారం చేస్తున్నారంటూ సిటీ సివిల్ కోర్ట్ మెట్లు ఎక్కింది.
ఇదిలా ఉండ‌గా తన పరువు నష్టం కలిగించే విధంగా ప్రసారం చేసిన వీడియోలను తొలగించాలని కోర్టులో పిటిషన్ వేసింది. రమావత్ మధు, అడ్వకేట్ సుబ్బారావు, హేమాకాంత్ రెడ్డి లతో పాటు పలు మీడియా సంస్థలకు.. డిజిటల్ మీడియా సంస్థలకు నోటీసులు జారీ చేసింది.

తనకు సంబంధం లేని మైక్రో ఫైనాన్స్ వివాదంలో తనపై అసత్య ప్రచారం చేశారంటూ పిటిష‌న్ లో పేర్కొంది మంగ్లీ. తన పరువు కి నష్టం కలిగించే విధంగా వార్తలు ప్రసారం చేశారంటూ వాపోయింది సింగ‌ర్ మంగ్లీ. ముందస్తు ప్రాణాలికలతో కొందరు వ్యక్తులు ఉద్దేశ పూర్వకంగా తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీశారని పేర్కొంది. దీని కార‌ణంగా తన ప్రతిష్టకు తీవ్ర నష్టం కలిగించాయని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. సోషల్ మీడియాలో ఆయా లింకులను వెంటనే తొలగించాలని.. భవిష్యత్తులో తనపై అసత్య ప్రచారం చేయకుండా నిరోధించాలని కోర్టును కోరింది.

  • Related Posts

    మ‌హిళా క‌మిష‌న్ ముందు నోరా ఫ‌తేహి

    Spread the love

    Spread the loveస‌ర్కే చున‌ర్ తేరి స‌ర్కే పాట‌లో అస‌భ్య‌త న్యూఢిల్లీ : బాలీవుడ్ కి చెందిన న‌టి నోరా ఫ‌తేహి వివాదాస్ప‌దంగా మారారు. త‌ను పూర్తి అస‌భ్య‌త‌తో కూడిన పాట‌లో న‌టించింది. దీనిపై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్త‌మైంది. జాతీయ మ‌హిళా…

    సినిమా అంటే వినోదం కాదు ప్ర‌జా ఉద్య‌మం

    Spread the love

    Spread the loveకీల‌క వ్యాఖ్య‌లు చేసిన దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్ హైద‌రాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్ట‌ర్ దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నిర్మించిన “జై బోలో తెలంగాణ” సినిమాలో తాను ఐపీఎస్ ఆఫీసర్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *