కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి వంగలపూడి అనిత
అమరావతి : ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతి లోని సచివాలయంలో శుక్రవారం జరిగిన రెండో రోజు జిల్లా కలెక్టర్ల సదస్సుకు అధ్యక్షత వహించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని ఆయా జిల్లాల కలెక్టర్లతో పాటు మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి అనిత వంగలపూడి. అపారమైన అనుభవం కలిగిన సీఎం నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాలలో ముందుకు వెళుతోందన్నారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంపద సృష్టి దిశగా ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. ప్రధానంగా ఈ సదస్సులో సంపదపై దృష్టి సారించడం జరిగిందన్నారు. సంపద సృష్టి ద్వారానే స్థిరమైన సంక్షేమం సాధ్యం అని సీఎం దిశా నిర్దేశం చేశారని చెప్పారు. ఏపీ లో కూటమి సర్కార్ కొలువు తీరిన తర్వాత 23 లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాలు జరిగాయన్నారు. వీటి ద్వారా 24 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టామన్నారు. 2027 మార్చి నాటికి రెవెన్యూ రికార్డుల ఆధునీకరణ చేస్తామని తెలిపారు అనిత వంగలపూడి. గ్రీన్ ఎనర్జీ, AI, క్వాంటమ్ టెక్నాలజీ రంగాల్లో ఏపీని అగ్రగామిగా మారుస్తామన్నారు.






