ఓబీసీ వ‌ర్గాల‌కు న్యాయం చేయాలి : వీహెచ్

నిరాహార దీక్ష‌కు దిగిన ప్ర‌భుత్వ స‌ల‌హాదారు

హైద‌రాబాద్ : జాతీయ స్థాయిలో కుల గణన జరపాలని, దేశ వ్యాప్తంగా ఓబీసీ వర్గాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వ బీసీ సంక్షేమ సలహాదారు, మాజీ ఎంపీ వి. హనుమంతరావు నిరాహార దీక్ష చేప‌ట్టారు. ఈ దీక్షకు అఖిల భారత ఓబీసీ విద్యార్థుల సంఘం (ఏఐఓబీసీఎస్ఏ) తమ ప్రగాఢ సంఘీభావాన్ని తెలియ జేసింది.

సామాజిక న్యాయం, సమాన ప్రాతినిధ్యం, అణగారిన వర్గాల కోసం సాక్ష్యాధారిత విధాన రూపకల్పన దిశగా సాగుతున్న ఈ చారిత్రాత్మక ప్రజాస్వామ్య పోరాటానికి ఏఐఓబీసీఎస్ఏ గట్టిగా అండగా నిలుస్తుంది. ఓబీసీల వాస్తవ సామాజిక-ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోవడానికి, రాజ్యాంగ రక్షణలు, సంక్షేమ విధానాలను నిష్పక్షపాతంగా అమలు చేయడానికి సమగ్ర కుల గణన నిర్వహించడం అత్యవసరం అని అభిప్రాయ‌ప‌డింది.

ఏఐఓబీసీఎస్ఏ తరపున, జాతీయ సలహాదారు ఇంజనీర్ అల్లా రామకృష్ణ, జాతీయ కార్యదర్శి , హెచ్‌సీయూ యూనిట్ అధ్యక్షుడు లక్ష్మీనరసయ్య (లక్కీ), తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ గణేష్ గౌడ్, ఓయూ ఉపాధ్యక్షుడు శివ యాదవ్, ఇతర ప్రతినిధులు వ్యక్తిగతంగా సంఘీభావ లేఖను అందజేశారు వీ హెచ్ కు. సంస్థ అచంచలమైన మద్దతును తెలిపారు. ఈ సంద‌ర్బంగా సంస్థ ప్ర‌తినిధుల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు వి. హ‌నుమంత రావు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *