ఓబీసీ వ‌ర్గాల‌కు న్యాయం చేయాలి : వీహెచ్

Spread the love

నిరాహార దీక్ష‌కు దిగిన ప్ర‌భుత్వ స‌ల‌హాదారు

హైద‌రాబాద్ : జాతీయ స్థాయిలో కుల గణన జరపాలని, దేశ వ్యాప్తంగా ఓబీసీ వర్గాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వ బీసీ సంక్షేమ సలహాదారు, మాజీ ఎంపీ వి. హనుమంతరావు నిరాహార దీక్ష చేప‌ట్టారు. ఈ దీక్షకు అఖిల భారత ఓబీసీ విద్యార్థుల సంఘం (ఏఐఓబీసీఎస్ఏ) తమ ప్రగాఢ సంఘీభావాన్ని తెలియ జేసింది.

సామాజిక న్యాయం, సమాన ప్రాతినిధ్యం, అణగారిన వర్గాల కోసం సాక్ష్యాధారిత విధాన రూపకల్పన దిశగా సాగుతున్న ఈ చారిత్రాత్మక ప్రజాస్వామ్య పోరాటానికి ఏఐఓబీసీఎస్ఏ గట్టిగా అండగా నిలుస్తుంది. ఓబీసీల వాస్తవ సామాజిక-ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోవడానికి, రాజ్యాంగ రక్షణలు, సంక్షేమ విధానాలను నిష్పక్షపాతంగా అమలు చేయడానికి సమగ్ర కుల గణన నిర్వహించడం అత్యవసరం అని అభిప్రాయ‌ప‌డింది.

ఏఐఓబీసీఎస్ఏ తరపున, జాతీయ సలహాదారు ఇంజనీర్ అల్లా రామకృష్ణ, జాతీయ కార్యదర్శి , హెచ్‌సీయూ యూనిట్ అధ్యక్షుడు లక్ష్మీనరసయ్య (లక్కీ), తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ గణేష్ గౌడ్, ఓయూ ఉపాధ్యక్షుడు శివ యాదవ్, ఇతర ప్రతినిధులు వ్యక్తిగతంగా సంఘీభావ లేఖను అందజేశారు వీ హెచ్ కు. సంస్థ అచంచలమైన మద్దతును తెలిపారు. ఈ సంద‌ర్బంగా సంస్థ ప్ర‌తినిధుల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు వి. హ‌నుమంత రావు.

  • Related Posts

    టీవీకేకు మ‌ద్ద‌తు హైక‌మాండ్ నిర్ణ‌యం

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ పుదుచ్ఏచ‌రి : త‌మిళ‌నాడులో టీవీకే విజ‌య్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ మ‌ద్ద‌తు ఇవ్వ‌డం ప‌ట్ల స్పందించారు, ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు క‌ర్ణాట‌క రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్. మా…

    అమ్మకు ఎదురు లేదు తిరుగు లేదు

    Spread the love

    Spread the loveఇవాళ త‌ల్లుల దినోత్స‌వం సంద‌ర్బంగా అమ‌రావ‌తి : రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇవాళ ప్ర‌పంచ వ్యాప్తంగా అంత‌ర్జాతీయ త‌ల్లుల దినోత్స‌వం. ఈ సంద‌ర్బంగా స్పందించారు లోకేష్. కనిపించే ప్రతి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *