నేరస్తులకు కఠిన శిక్ష పడేలా చూస్తాం

ప్ర‌క‌టించిన సీఎం జోసెఫ్ విజ‌య్

చెన్నై : త‌మిళ‌నాడు సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు .మరణించిన బాలిక కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నిందితులకు చట్టం ప్రకారం కఠిన శిక్ష పడేలా చూస్తానని కూడా ఆయన తమకు హామీ ఇచ్చారని ఆ బాలిక తల్లిదండ్రులు తెలిపారు. POCSO చట్టం కింద కోయంబత్తూరుకు చెందిన ఆ బాలిక కుటుంబానికి రూ.7 లక్షల పరిహారం అందించడం జ‌రిగింద‌న్నారు.ముఖ్యమంత్రి విజయ్ ఫోన్ ద్వారా వారిని సంప్రదించి, తన సానుభూతిని వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండ‌గా రాష్ట్ర వ్యాప్తంగా బాలిక వ్య‌వ‌హారం క‌ల‌క‌లం రేపింది. దీనిపై పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్త‌మైంది. కొత్త‌గా కొలువు తీరిన టీవీకే స‌ర్కార్ వెంట‌నే దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టింది. సీఎం విజ‌య్ ఆదేశాల మేర‌కు ఇప్ప‌టికే మంత్రులు ఘ‌ట‌నా స్థ‌లానికి వెళ్లారు. బాధిత కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు. వారికి భ‌రోసా ఇచ్చే ప్ర‌యత్నం చేశారు. నిందితులు ఎక్క‌డ ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా, ఎవ‌రైనా స‌రే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలని ఆదేశించారు సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్.

  • Related Posts

    నిజామాబాద్ అభివృద్దికి క‌ట్టుబ‌డి ఉన్నా

    హైద‌రాబాద్ : టీపీసీసీ చీఫ్ , ఎమ్మెల్సీ మ‌హేష్ కుమార్ గౌడ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఉమ్మడి నిజామాబాద్ అభివృద్ధికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ మరో కీలక ముందడుగు వేశారు. జిల్లా…

    ఢిల్లీ ప‌ర్య‌ట‌నలో మంత్రి ఎస్. స‌విత బిజీ

    అమరావతి : రాష్ట్రానికి చెందిన టెక్స్ టైల్స్ ఉత్పత్తులు అమ్మకాలే లక్ష్యంగా రెండ్రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి గురువారం రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ ప్రగతి మైదానంలోని భారత్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *