రేవంత్ రెడ్డి ధాన్యం కొనుగోలు చేయ‌డం లేదు

నిజ‌మేన‌ని క్ష‌మాప‌ణ చెప్పిన ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి

న‌ల్ల‌గొండ జిల్లా : కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మ‌రోసారి సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. త‌మ సీఎం అబ‌ద్దాలు చెబుతున్నాడ‌ని, నిజంగానే రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయ‌డం లేద‌ని ఒప్పుకున్నారు. ఇందుకు సంబంధించి ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న ఆరోప‌ణ‌లు వాస్త‌వ‌మేన‌ని స్ప‌ష్టం చేశారు . ధాన్యం కొనుగోలులో జరిగిన లోపాలకు తాను బేష‌ర‌తుగా క్షమాపణలు చెపుతున్నాన‌ని, త‌న‌ను మ‌న్నించాల‌ని కోరారు కోమ‌టిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

ధాన్యం కొనుగోలుకు సంబంధించి, చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెంలో రైతుల కోసం కేటాయించిన ప్రైవేటు గోదామును సందర్శించారు. ధాన్యం కొనుగోలు జరగనందుకు ఎమ్మెల్యే క్షమాపణలు కోరారు. రైతుల కష్టాలు వాస్తవ‌మేన‌ని , ఇందులో ఎలాంటి దాప‌రికం లేద‌న్నారు. ధాన్యం కొనుగోలులో జాప్యం జరుగుతోందన్నది నిజం అన్నారు. తాను కూడా అంగీకరిస్తున్న‌ట్లు తెలిపారు.. దీనిపై మేము కూడా ఆందోళన చెందుతున్నామన్నారు. ఇక నుంచి వారి ధాన్యాన్ని వెంట‌నే కొనుగోలు చేసేలా చ‌ర్య‌లు తీసుకుంటామన్నారు. ‘

  • Related Posts

    నిజామాబాద్ అభివృద్దికి క‌ట్టుబ‌డి ఉన్నా

    హైద‌రాబాద్ : టీపీసీసీ చీఫ్ , ఎమ్మెల్సీ మ‌హేష్ కుమార్ గౌడ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఉమ్మడి నిజామాబాద్ అభివృద్ధికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ మరో కీలక ముందడుగు వేశారు. జిల్లా…

    ఢిల్లీ ప‌ర్య‌ట‌నలో మంత్రి ఎస్. స‌విత బిజీ

    అమరావతి : రాష్ట్రానికి చెందిన టెక్స్ టైల్స్ ఉత్పత్తులు అమ్మకాలే లక్ష్యంగా రెండ్రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి గురువారం రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ ప్రగతి మైదానంలోని భారత్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *