రేవంత్ రెడ్డి ధాన్యం కొనుగోలు చేయ‌డం లేదు

Spread the love

నిజ‌మేన‌ని క్ష‌మాప‌ణ చెప్పిన ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి

న‌ల్ల‌గొండ జిల్లా : కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మ‌రోసారి సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. త‌మ సీఎం అబ‌ద్దాలు చెబుతున్నాడ‌ని, నిజంగానే రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయ‌డం లేద‌ని ఒప్పుకున్నారు. ఇందుకు సంబంధించి ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న ఆరోప‌ణ‌లు వాస్త‌వ‌మేన‌ని స్ప‌ష్టం చేశారు . ధాన్యం కొనుగోలులో జరిగిన లోపాలకు తాను బేష‌ర‌తుగా క్షమాపణలు చెపుతున్నాన‌ని, త‌న‌ను మ‌న్నించాల‌ని కోరారు కోమ‌టిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

ధాన్యం కొనుగోలుకు సంబంధించి, చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెంలో రైతుల కోసం కేటాయించిన ప్రైవేటు గోదామును సందర్శించారు. ధాన్యం కొనుగోలు జరగనందుకు ఎమ్మెల్యే క్షమాపణలు కోరారు. రైతుల కష్టాలు వాస్తవ‌మేన‌ని , ఇందులో ఎలాంటి దాప‌రికం లేద‌న్నారు. ధాన్యం కొనుగోలులో జాప్యం జరుగుతోందన్నది నిజం అన్నారు. తాను కూడా అంగీకరిస్తున్న‌ట్లు తెలిపారు.. దీనిపై మేము కూడా ఆందోళన చెందుతున్నామన్నారు. ఇక నుంచి వారి ధాన్యాన్ని వెంట‌నే కొనుగోలు చేసేలా చ‌ర్య‌లు తీసుకుంటామన్నారు. ‘

  • Related Posts

    తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకే మహానాడు

    Spread the love

    Spread the loveవ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు అమరావతి : తెలుగు ప్రజలు ఘనంగా చేసుకునే ఆత్మీయ రాజకీయ పండుగ మహానాడు అని అన్నారు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తే అధినేత అన్న మహోన్నత…

    ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ ఇంటికి పోలీసులు వెళ్ల‌లేదు

    Spread the love

    Spread the loveఅదంతా అబ‌ద్ద‌మ‌ని ఖండించిన మంత్రి అనిత అమ‌రావ‌తి : తెలుగు రాష్ట్రాల‌లో హాట్ టాపిక్ గా మారింది ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ రావు వ్య‌వ‌హారం. ఓ వైపు బండి సంజ‌య్ కొడుకు బండి భ‌గీర‌థ్ పోక్సో కేసు సంచ‌ల‌నంగా మారితే…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *