రేవంత్ రెడ్డి ధాన్యం కొనుగోలు చేయ‌డం లేదు

నిజ‌మేన‌ని క్ష‌మాప‌ణ చెప్పిన ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి

న‌ల్ల‌గొండ జిల్లా : కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మ‌రోసారి సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. త‌మ సీఎం అబ‌ద్దాలు చెబుతున్నాడ‌ని, నిజంగానే రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయ‌డం లేద‌ని ఒప్పుకున్నారు. ఇందుకు సంబంధించి ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న ఆరోప‌ణ‌లు వాస్త‌వ‌మేన‌ని స్ప‌ష్టం చేశారు . ధాన్యం కొనుగోలులో జరిగిన లోపాలకు తాను బేష‌ర‌తుగా క్షమాపణలు చెపుతున్నాన‌ని, త‌న‌ను మ‌న్నించాల‌ని కోరారు కోమ‌టిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

ధాన్యం కొనుగోలుకు సంబంధించి, చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెంలో రైతుల కోసం కేటాయించిన ప్రైవేటు గోదామును సందర్శించారు. ధాన్యం కొనుగోలు జరగనందుకు ఎమ్మెల్యే క్షమాపణలు కోరారు. రైతుల కష్టాలు వాస్తవ‌మేన‌ని , ఇందులో ఎలాంటి దాప‌రికం లేద‌న్నారు. ధాన్యం కొనుగోలులో జాప్యం జరుగుతోందన్నది నిజం అన్నారు. తాను కూడా అంగీకరిస్తున్న‌ట్లు తెలిపారు.. దీనిపై మేము కూడా ఆందోళన చెందుతున్నామన్నారు. ఇక నుంచి వారి ధాన్యాన్ని వెంట‌నే కొనుగోలు చేసేలా చ‌ర్య‌లు తీసుకుంటామన్నారు. ‘

  • Related Posts

    ప్రధాని మోదీతో ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియన్ భేటీ

    టెహ్రాన్ : ఇరాన్ అధ్యక్షుడు ప్రధాని మోదీ, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ , కిర్గిజ్‌స్థాన్, రష్యా, తజికిస్థాన్ అధ్యక్షులతో సహా పలువురు పాల్గొనే నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. కిర్గిజ్‌స్థాన్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్…

    వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం చారిత్రాత్మక ఘట్టం

    అమరావ‌తి : వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం చారిత్రాత్మక ఘట్టం అని పేర్కొన్నారు మంత్రి మండిప‌ల్లి రాంప్ర‌సాద్ రెడ్డి. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో వెలిగొండను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశార‌న్నారు. ఈ సంద‌ర్బంగా సీఎంకు ధ‌న్య‌వాదాలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *