జూన్ 4 ఆన్ లైన్ లో వస్త్రాలు ఈ -వేలం

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన తిరుమ‌ల దేవ‌స్థానం

తిరుప‌తి : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. భ‌క్త బాంధ‌వుల‌కు తీపి క‌బురు చెప్పింది. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలు కొత్తవి / ఉపయోగించినవి / పాక్షికంగా దెబ్బ తిన్నవి 147 లాట్ల వస్త్రాలతో పాటు న్యూ ఆర్ట్ సిల్క్ శారీస్ , సిల్క్ శారీస్ ను వేలం వేయ‌నున్న‌ట్లు తెలిపింది. ఈ వేలం పాట వచ్చే నెల జూన్ 4వ తేదీ నుంచి 6వ తేదీ వ‌ర‌కు జ‌రుగుతుంద‌ని వెల్ల‌డించింది.

ఇదిలా ఉండ‌గా టిటిడి ఆన్ లైన్ లో EA ID Nos 25918 to 25923 ద్వారా ఈ వేలం వేయనున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఈ – కొనుగోలు పోర్టల్ లో రిజిస్టర్ అయిన ఆసక్తి కల్గిన బిడ్డర్లు వస్త్రాల ఆన్ లైన్ వేలంలో పాల్గొనటానికి అర్హులు అని వెల్ల‌డించింది. ఇతర వివరాలకు స్థానిక జనరల్ మేనేజర్ (వేలములు) / ఏఈఓ (వేలములు), టిటిడి, హరేకృష్ణ మార్గ్ , తిరుపతిలో https://konugolu.ap.gov.in లేదా టిటిడి వెబ్ సైట్ www.tirumala.org లేదా 0877 – 2264429 ఫోన్ నెంబర్ ద్వారా గాని సంప్రదించాల‌ని సూచ‌చించింది.

  • Related Posts

    శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భ‌ద్ర‌త

    తిరుపతి : తిరుమల రాబోయే శ్రీవారి బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా తిరుమల పోలీసులు, టీటీడీ విజిలెన్స్ విభాగం ఆధ్వ‌ర్యంలో తిరుమలలోని వీవీఐపీ గెస్ట్ హౌస్ నిర్వాహకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టీటీడీ చీఫ్ విజిలెన్స్, సెక్యూరిటీ…

    శ్రీవారి ఆలయంలో స్నపన తిరుమంజనం

    తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా శాస్త్రోక్తంగా ప‌విత్ర సమర్పణ జరిగింది.ఈ సందర్భంగా ఉదయం యాగశాలలో హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఆ తరువాత సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *