16న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

తిరుపతి : తిరుప‌తి లోని శ్రీనివాస మంగాపురంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో జూలై 17 నుంచి 19వ తేదీ వరకు జరగనున్న సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలకు ముందుగా జూలై 16న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ విష‌యాన్ని ఇవాళ తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) అధికారికంగా వెల్ల‌డించింది. ఈ సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాతం, తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం అనంతరం ఉదయం 6.30 నుంచి 11.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుందని తెలిపింది.

ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రిని పవిత్ర జలంతో శుద్ధి చేసి, నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తార‌ని పేర్కొంది టీటీడీ.అనంతరం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తారని తెలిపింది. ఈ సంద‌ర్బంగా శ్రీనివాస మంగాపురంలోని శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర స్వామి వారి ఆల‌యంలో ఈనెల 17 నుంచి 19వ తేదీ వ‌ర‌కు మూడు రోజుల పాటు జ‌రిగే సాల‌క‌ట్ల సాక్షాత్కార వైభ‌వోపేత్స‌వాల‌కు భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన‌ట్లు వెల్ల‌డించింది టీటీడీ.

  • Related Posts

    తిరుమ‌ల‌లో వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు : టీటీడీ

    తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి (టీటీడీ) సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు జూలై 17న శ్రీ‌వారి ఆల‌యంలో ఆణివార ఆస్థానం జ‌ర‌గ‌నుంద‌ని తెలిపారు టీటీడీ ఈవో ముద్దాడ ర‌విచంద్ర. దీంతో పాటు జూలై, ఆగ‌స్టు, సెప్టెంబ‌ర్…

    టీటీడీ బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యునిగా క‌న్న‌బాబు

    తిరుమల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) ఎక్స్ అఫిషియో సభ్యునిగా దేవాదాయ శాఖ కార్యదర్శి కె. కన్నబాబు తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి వీరితో ప్రమాణ స్వీకారం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *