చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో మరో కొత్త పార్టీ రాబోతోంది. గత కొంత కాలంగా రాష్ట్రంలో కొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టేందుకు ముహూర్తం ఖరారు చేశారు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ ఆఫీసర్ కె. అన్నామలై. ఆయన మెంటార్ గా వి ది లీడర్స్ పేరుతో ఫౌండేషన్ ను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ సంస్థలో దాదాపు 30 లక్షల మందికి పైగా స్వచ్చంధంగా చేరారు. తమ లక్ష్యం 50 లక్షల మంది చేరాలని దానిని చేరుకోవడం పెద్ద కష్టం ఏమీ కాదన్నారు. ఇందులో భాగంగా వి ది లీడర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పొల్లాచ్చిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా చీఫ్ మెంటార్ గా ఉన్న కె. అన్నామలై సంచలన ప్రకటన చేశారు. ఇక నుంచి వి ది లీడర్స్ ఫౌండేషన్ రాజకీయ పార్టీగా మార బోతోందని వెల్లడించారు సభ సాక్షిగా.
2031లో “ఆరోగ్యకరమైన రాజకీయాల” ఎజెండాతో పార్టీ ప్రజల ముందుకు వస్తుందని అన్నామలై అన్నారు. “ప్రజలు మాకు ఆ అవకాశాన్ని కల్పిస్తారు,” అని ఆయన పేర్కొన్నారు. ఈ సదస్సు కొత్తగా ఎన్నికైన ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించడానికి కాదు, మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా జరిగిందని చెప్పారు. ఈ ర్యాలీ ఏ రాజకీయ పార్టీని నిందించడానికి కాదు. అలాగే, ఒక (నిర్దిష్ట) నాయకుడు మంచివాడు కాదని ఆరోపించడానికి కూడా కాదంటూ ఆయన జోసెఫ్ విజయ్ కు మద్దతు గా ప్రకటించారు. తమిళనాడులో అన్నామలై ఉద్యమం ఒక శక్తిగా ఎందుకు మారబోతోందని అన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రస్తావిస్తూ, అన్నామలై ప్రభుత్వ రుణం గురించి మాట్లాడారు. TVK ప్రభుత్వం ఈ ఏడాది కనీసం రూ. 85,000 కోట్లు, వచ్చే ఏడాది రూ. 80,000 కోట్లు అప్పు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. 2031లో ఆ ప్రభుత్వం పదవీకాలం ముగిసే సమయానికి మొత్తం రుణం రూ. 14-15 లక్షల కోట్లకు చేరుకుంటుందని ఆయన ఆరోపించారు. మంచి నాయకులను తీసుకు రావడం మా బాధ్యత… ప్రతి వ్యక్తి (సామాజిక సేవా కార్యక్రమాల కోసం) పని చేయడం మొదలు పెట్టినప్పుడు, మార్పు మన కళ్ల ముందే ఆవిష్కృతమవుతుంది, దాన్ని మీరు చూస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.





