టీటీడీ బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యునిగా క‌న్న‌బాబు

తిరుమల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) ఎక్స్ అఫిషియో సభ్యునిగా దేవాదాయ శాఖ కార్యదర్శి కె. కన్నబాబు తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకున్నారు క‌న్న‌బాబు. రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. కె.కన్నబాబు కు శ్రీవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అదనపు ఈవో అందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్వో మురళీకృష్ణ, డిప్యూటీ ఈవోలు భాస్కర్, ప్రశాంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకున్న అనంత‌రం దేవాదాయ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి క‌న్న‌బాబు మీడియాతో మాట్లాడారు.

జీవితంలో మ‌రిచి పోలేని అనుభూతిని పొందాన‌ని పేర్కొన్నారు. వృత్తి ప‌రంగా ఎన్నోసార్లు స్వామిని ద‌ర్శించుకున్న‌ట్లు తెలిపారు. అయితే అధికారికంగా దేవాదాయ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి హొదాలో టీటీడీ పాల‌క మండ‌లికి సంబంధించి ఎక్స్ అఫిసియో మెంబ‌ర్ గా సంత‌కం చేయ‌డం మ‌రిచి పోలేన‌ని పేర్కొన్నారు. ఇదంతా ఆ క‌లియుగ దైవం క‌ల్పించిన మహ‌త్ భాగ్యంగా తాను భావిస్తున్న‌ట్లు చెప్పారు కె. క‌న్న‌బాబు. ఈ సంద‌ర్బంగా సీఎం చంద్ర‌బాబు నాయుడు, స‌ర్కార్ కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. సామాన్య భ‌క్తుల‌కే అత్య‌ధిక ప్రాధాన్య‌త టీటీడీ ఇస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు.

  • Related Posts

    శ్రీవారి ఆలయంలో స్నపన తిరుమంజనం

    తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా శాస్త్రోక్తంగా ప‌విత్ర సమర్పణ జరిగింది.ఈ సందర్భంగా ఉదయం యాగశాలలో హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఆ తరువాత సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు,…

    100 పుణ్య క్షేత్రాల‌ను క‌లిపేలా ర‌హ‌దారులు

    అమ‌రావ‌తి : ఏపీ ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రాష్ట్రంలో ఆధ్యాత్మిక ప‌ర్యాట‌క రంగాన్ని బ‌లోపేతం చేస్తోంది. ఇందులో భాగంగా 100 పుణ్యక్షేత్రాలను అనుసంధానించే రోడ్డు ప్రాజెక్టులను ప్రారంభించింది స‌ర్కార్. రూ. 120 కోట్ల వ్యయంతో 205 కిలోమీటర్ల మేర రోడ్డు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *