సమతామూర్తిని దర్శించుకున్న కేంద్ర జాయింట్ సెక్రటరీ

శంషాబాద్ (ముచ్చింతల్): కేంద్ర సమాచార, ప్రసార శాఖ జాయింట్ సెక్రటరీ పృథుల్ కుమార్ తన కుటుంబ సమేతంగా ముచ్చింతల్ లోని సమతామూర్తి (స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ)ని సందర్శించారు. 216 అడుగుల ఎత్తున్న భగవద్ రామానుజాచార్యుల విగ్రహాన్ని దర్శనం చేసుకున్నారు. సువర్ణ విగ్రహాన్ని వారు దర్శించుకుని, ప్రత్యేక పూజలో వారు పాల్కొన్నారు. అనంతరం ఆవరణలోని 108 దివ్య దేశాల నమూనా ఆలయాలను, భద్రవేదిలోని డిజిటల్ లైబ్రరీ, సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించారు.

ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు వారికి ఘన స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సమతామూర్తి కేంద్ర విశిష్టత, రామానుజాచార్యుల సమానత్వ సందేశం అద్భుతంగా ఉన్నాయని ఈ సందర్భంగా కొనియాడారు. ఇదే స‌మ‌యంలో ఎన్నో కోట్లు ఖ‌ర్చు చేసి శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన‌జీయ‌ర్ స్వామీజీ శ్రీ రామానుజుల వారి విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయ‌డం అభినంద‌నీయ‌మ‌ని పేర్కొన్నారు కేంద్ర స‌మాచార‌, ప్ర‌సార శాఖ సంయుక్త కార్య‌ద‌ర్శి. ఇదిలా ఉండ‌గా తిరుమ‌ల‌లో శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామికి పూర్వ వైభ‌వాన్ని తీసుకు రావ‌డంలో కీల‌క పాత్ర పోషించారు.

  • Related Posts

    శ్రీవారి పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

    తిరుమల : శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ముందుగా సాయంత్రం సేనాధిపతివారిని ఆలయ మాడవీధుల గుండా ఊరేగింపుగా వసంత మండపానికి వేంచేపు చేశారు. అనంతరం మృత్సం గ్రహణం, ఆస్థానం నిర్వహించారు. ఆ తరువాత ఆలయంలోని పవిత్ర మండపంలో అంకురార్పణ…

    అన్న ప్ర‌సాదం, ల‌డ్డు పోటు భ‌వ‌నాలు ప్రారంభం

    విజ‌య‌వాడ : ల‌క్ష‌లాది మంది భ‌క్తుల కొంగు బంగార‌మైన విజ‌య‌వాడ‌లోని శ్రీ క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యంలోనూత‌నంగా , అత్యాధునిక వ‌స‌తి సౌక‌ర్యాల‌తో నిర్మించిన‌ అన్నప్రసాదం, లడ్డు పోటు భవనాల‌ను శుక్ర‌వారం ప్రారంభించారు రాష్ట్ర దేవాదాయ‌, ధ‌ర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయ‌ణ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *