అన్న ప్ర‌సాదం, ల‌డ్డు పోటు భ‌వ‌నాలు ప్రారంభం

విజ‌య‌వాడ : ల‌క్ష‌లాది మంది భ‌క్తుల కొంగు బంగార‌మైన విజ‌య‌వాడ‌లోని శ్రీ క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యంలో
నూత‌నంగా , అత్యాధునిక వ‌స‌తి సౌక‌ర్యాల‌తో నిర్మించిన‌ అన్నప్రసాదం, లడ్డు పోటు భవనాల‌ను శుక్ర‌వారం ప్రారంభించారు రాష్ట్ర దేవాదాయ‌, ధ‌ర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయ‌ణ రెడ్డి. ఇంద్రకీలాద్రి కొండపై ఉన్న ఈ ఆలయంలో . ₹52.50 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ సముదాయంలో, ఒకేసారి 800 మంది భోజనం చేసేలా భోజనశాల , 10,000 మందికి ఆహారాన్ని సిద్ధం చేసి వడ్డించగల సామర్థ్యం ఉన్న ఆధునిక వంటశాల ఉన్నాయి.

ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ భక్తులు, స్వచ్ఛంద సేవకుల కోసం నిర్మించిన ఈ భవనంలో ఒకేసారి 800 మంది భోజనం చేయవచ్చు అని చెప్పారు. ఇక్కడ ఉన్న యాంత్రీకరణతో కూడిన వంటశాలల ద్వారా ఒకేసారి 10,000 మందికి ఆహారాన్ని సిద్ధం చేసి వడ్డించే సదుపాయం ఉంది” అని అన్నారు. అలాగే, టిడిపి ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులతో మేము ఇక్కడ రెండు భవనాలను ప్రారంభించ‌డం అమ్మ వారి కృపేన‌ని పేర్కొన్నారు. ఒకటి అన్నప్రసాద భవనం కాగా, మరొకటి లడ్డు పోటు భవనం. ఈ రెండు భవనాలు యాత్రికుల కోసం ఉద్దేశించినవి అని తెలిపారు. వీటి నిర్మాణానికి సుమారు రూ. 50 కోట్లు ఖర్చు చేశార‌ని పేర్కొన్నారు.

  • Related Posts

    శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్ల‌పై ఈవో ఆరా

    తిరుమ‌ల : ఏటా తిరుమలకు పెరుగుతున్న భక్తుల సంఖ్య, ఇటీవల రథసప్తమి సందర్భంగా సుమారు 3.75 లక్షల మంది భక్తులు, 15 వేల వాహనాలు వచ్చిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని రాబోయే బ్రహ్మోత్సవాల్లో భక్తుల రద్దీపై ముందస్తు అంచనాలు రూపొందించినట్లు తెలిపారు…

    వాల్మీకిపురంలో వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం

    తిరుప‌తి అన్న‌మ‌య్య జిల్లా : అన్న‌మ‌య్య తిరుప‌తి జిల్లాలో పేరు పొందిన , భ‌క్తులు నిత్యం కొలిచేవాల్మీకిపురం శ్రీ పట్టాభిరామ స్వామివారి ఆలయంలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. శ్రీరామ పట్టాభిషేక ఘట్టాన్ని కనులారా వీక్షించిన భక్తులు ఆధ్యాత్మిక…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *