నా టార్గెట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాదు : కొండా సుష్మిత

వరంగ‌ల్ జిల్లా : రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ‌, కొండా ముర‌ళి కూతురు కొండా సుష్మిత చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. ఈ సంద‌ర్బంగా కాంగ్రెస్ పార్టీ సంజాయిషీ కోరింది. ఈ మేర‌కు కొండా సురేఖ‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు కొండా సుష్మిత‌. శుక్ర‌వారం ఆమె జాతీయ మీడియాతో మాట్లాడారు. తాను కాంగ్రెస్ పార్టీని విమ‌ర్శించ లేద‌న్నారు. ఏనాడూ పార్టీ లైన్ దాట‌లేద‌ని అన్నారు. న‌డ‌వ‌లేని వ్య‌క్తి రేవూరి ప్ర‌కాష్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. పార్టీ నియ‌మ నిబంధ‌న‌ల‌ను తోసి రాజ‌ని కామెంట్స్ చేసింది తాను కాద‌ని , సీఎం రేవంత్ రెడ్డి అని మ‌రోసారి సీరియ‌స్ కామెంట్స్ చేశారు సుష్మిత‌.

నేను కాంగ్రెస్ పార్టీని విమర్శించలేదు, రేవంత్ రెడ్డిని విమర్శించానన‌ని అన్నారు. ఇందులో త‌న త‌ప్పు ఏమీ లేద‌న్నారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ , ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ అంటే త‌న‌కు కూడా గౌర‌వం ఉంద‌న్నారు కొండా సుష్మిత‌. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి, అతని సోదరులు విపరీతమైన అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అందుకే అతన్ని టార్గెట్ చేశానని చెప్పారు. ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడానికి అతనికి ఏం అధికారం ఉంది అని ప్ర‌శ్నించారు. నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని ప్ర‌క‌టించారు కొండా సుష్మిత‌. వెన‌క్కి త‌గ్గే ప్ర‌స‌క్తి లేద‌న్నారు.

  • Related Posts

    మంత్రి నాగేంద్ర రాజీనామాకు బీజేపీ-జేడీఎస్ డిమాండ్

    బెంగ‌ళూరు : భారీ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న మంత్రి బి. నాగేంద్రను తిరిగి మంత్రివర్గంలోకి తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ దాని మిత్రపక్షమైన జనతా దళ్ (సెక్యులర్ – జేడీఎస్) బెంగళూరులో నిరసన చేపట్టాయి. బెంగళూరులోని విధాన సౌధ వద్ద,…

    సీఎం అమెరికా పర్యటన రద్దు వెనుక బీజేపీ కుట్ర

    హైద‌రాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి. హనుమంత రావు కేంద్రంపై సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వక పోవడం వెనుక బీజేపీ నేతల కుట్రలు ఉన్నాయని ఆరోపించారు. శుక్రవారం బీ.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *