గుజరాత్ టైటాన్స్ చేతిలో ఎలిమినేటర్ -2 లో పరాజయం
మల్హాన్ పూర్ : ఐపీఎల్ -19 సీజన్ లో వండర్ బాయ్ మరోసారి రెచ్చి పోయాడు. గుజరాత్ బౌలర్ల భరతం పట్టాడు. వచ్చీ రావడంతోనే ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. తన ఆటతీరుతో బెంబేలెత్తి పోయారు. మరోసారి తను కేవలం 4 పరుగుల తేడాతో సెంచరీ దూరం చేసుకున్నాడు. కన్నీటి పర్యంతం అయ్యాడు. ఈసారి టోర్నీలో రాజస్తాన్ రాయల్స్ జట్టు ఎలిమినేటర్ వరకు చేరుకున్నదంటే దీనికి కారణం ఒకే ఒక్కడు వైభవ్ సూర్యవంశీ. తను మొన్నటికి మొన్న కేవలం 3 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు.
వైభవ్ సూర్యవంశీ ఏ ఒక్కరినీ వదలలేదు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. కేవలం 47 బంతులు మాత్రమే ఎదుర్కొని 8 ఫోర్లు 7 సిక్సర్లతో 96 రన్స్ చేశాడు. ఈ ఐపీఎల్ సీజన్ లో తనకు మరోసారి సెంచరీ చేజారింది. ఆఖరులో వచ్చిన ఫెరీరా చక్కలు చూపించాడు. ఇక రవీంద్ర జడేజా గాయం నుంచి కోలుకుని పరుగులు చేయడంతో 214 రన్స్ చేసింది. అనంతరం గిల్ సెంచరీతో కదం తొక్కాడు. తను 53 బంతులు ఎదుర్కొని 15 ఫోర్లు 3 సిక్సర్లతో 104 రన్స్ చేసి ఔట్ అయ్యాడు. సాయి సుదర్శన్ 32 బంతుల్లో 8 ఫోర్లు 1 సిక్స్ తో 58 పరుగులు చేశాడు. దీంతో సునాయసంగా గుజరాత్ గెలుపొందింది. ఫైనల్ కు అర్హత సాధించింది.






