యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు

Spread the love

ఏపీఎస్పీడీసీఎల్ సిఎండి శివశంకర్ లోతేటి వెల్లడి

తిరుపతి : ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని నెల్లూరు, కడప జిల్లాల్లో రాత్రి బలమైన గాలి, వర్షం కారణంగా పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి ఒక ప్రకటనలో తెలిపారు. కడప జిల్లాలోని కొండాపురం, మైదుకూరు, మైలవరం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు గ్రామీణ, దువ్వూరు, రాజుపాలెం, చాపాడు మండలాల్లోని 28 గ్రామాల్లోనూ, నెల్లూరు జిల్లాలోని కావలి గ్రామీణ, కొండాపురం, కోవూరు, ముత్తుకూరు, జలదంకి, దగదర్తి, అల్లూరు మండలాల్లోని 15 గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని తెలియజేశారు.

బలమైన గాలి, వర్షం కారణంగా ఈ రెండు జిల్లాల్లో 26 ఫీడర్లు, 114 కి.మీ. మేరకు విద్యుత్ లైన్లు, 213 స్తంభాలు, 131 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయన్నారు శివ శంక‌ర్ లోతేటి. తద్వారా ఈ రెండు జిల్లాల్లో 19 మండలాలల్లోని 35 గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడగా, ఆయా సర్కిళ్ల సూపరింటెండింగ్ ఇంజనీర్ల పర్యవేక్షణలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది శుక్రవారం మధ్యాహ్నానికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు తెలిపారు.

  • Related Posts

    పవన్ కళ్యాణ్ ఫ‌క్తు ప్యాకేజ్ స్టార్ : అనిరుధ్ రెడ్డి

    Spread the love

    Spread the loveసంచ‌ల‌న కామెంట్స్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే పాల‌మూరు జిల్లా : అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జ‌నుంప‌ల్లి అనిరుధ్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మ‌రోసారి ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను…

    ఇండియాకు చేరుకున్న ట్రంప్ కూతురు

    Spread the love

    Spread the loveరేపు తాజ్ మ‌హ‌ల్ సంద‌ర్శించ‌నుంది న్యూఢిల్లీ : అగ్ర రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ముద్దుల కూతురు టిఫానీ ట్రంప్ సంచ‌ల‌నంగా మారారు. ఆమె ఉన్న‌ట్టుండి భారీ భ‌ద్ర‌త మ‌ధ్య ఇండియాకు చేరుకున్నారు. త‌న ప‌ర్య‌ట‌న‌లో భాగంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *